Sunday 1 May 2016

B.A-I syllabus(T.M)విషయ సూచిక
1.    రాజనీతిశాస్త్రము-పరిచయంనిర్వచనం,పరిధి,ప్రాధాన్యత
2.    రాజనీతిశాస్త్ర అధ్యయన పద్ధతులు
3.    రాజనీతిశాస్త్రo- ఇతర సాంఘిక శాస్త్రాలు
4.    సంఘంరాజ్యం-జాతి
5.    సార్వబౌమాదికరం-లక్షణాలురకాలు
6.    రాజ్యవతరణ సిద్దంతాలు
7.    శాసనం-స్వేచ్ఛాసమానత్వం
8.    ప్రభుత్వ వర్గీకరణ
9.    అధికార వవ్రుధక్కరణ సిద్ధాంతం
10.                       ప్రభుత్వంగాలు
11.                       ప్రాతినిధ్య సిద్దంతాలు-ఓటింగ్ ప్రవర్తన
12.                       రాజకీయ పార్టిలు
13.                       ప్రజా నియంత్రణ-పద్ధతులు .
CHAPTER-1
1. రాజనీతి శాస్త్రం నిర్వచించి ,దాని పరిధి ,ప్రాధాన్యత తెలపండి ?
   పరిచయం:-
              గ్రీక్ శాస్త్రజ్ఞుడు అరిస్టాటిల్ అబిప్రాయపడినట్లు మానవుడు  సంఘ జీవి (Man is a social Animal) కాబట్టి  వ్యక్తికి సమాజనికి మధ్య సన్నిహిత సంభందం ఉంది . నాగరిక సమాజంలో ఏ  వ్యక్తి కూడా ఒంటరిగా జీవించడం అసాధ్యం .
 రాజనీతి శాస్త్రం –పురోగతి:-
గ్రీక్ దేశంలో రాజనీతిశాస్త్రo  నగర రాజ్యాలకు సంభందించిన శాస్త్రంగా అవతరించింది ‘పాలిటిక్స్’  అనే ఆంగ్ల  పదం గ్రీక్ బాషలోని  ‘polis’ అనగా ‘నగర –రాజ్యం’ అనే ఆంగ్ల పదం నుంచి రూపొందింది . అనాడు నగర –రాజ్యo గ్రీక్ ల రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర స్థానం , నగర –రాజ్య సమగ్ర పరిశీలనయే గ్రీక్ రాజనీతి పరమార్థం.
నిర్వచనాలు :-
1.    “ రాజనీతి శాస్త్రానికి ఆద్యంతాలు రెండు రాజ్యమే” –గర్నేర్ .
2.    “ ఎవరు ఎప్పుడు ఎలా అధికారాని పొందుతారో  పరిశీలించడం రాజనీతి శాస్త్రజ్ఞుని కర్తవ్యని”---లస్వేల్  బావించాడు .
రాజనీతి శాస్త్ర పరిధి:-
       గత రెండు వందల సంవత్సరాల కాలంలో రాజనీతి శాస్త్రం విషయ పరిధి బాగా విస్తరించిoది.సాంఘిక శాస్త్ర లన్నింటి లోను అనుకూలమైన రీతిలో సంభందాలను విస్తృత పరచుకోవడo ద్వారా రాజనీతి శాస్త్ర పరిధి బాగా విస్తరించిoదిమనవ సమాజానికి సంభందించిన అన్ని అంశాలలో ఈ శాస్త్రానికి సంభందo ఉంది రాజనీతి శాస్త్రo మానవు ని రాజకియ ప్రవర్తనలో అన్ని అంశాలు అధ్యయనంచేస్తుందని చప్పవచ్చు .రాజ్యం కార్యక్రమాలు పెరుగుతున్న కొద్ది ప్రజలో రాజకీయ చైతన్యాo క్రమంగా వ్యాప్తి చందడం వల్ల వార్తమన కాలంలో    రాజనీతి శాస్త్ర పరిధి విస్తృతంగా పెరిగింది. పౌలు తమను తాము పరిపాలించు కొనే విషయం లో రాజ్యాలను నిర్మించుకున్నారు ప్రభుత్వలు ఏర్పరచుకొని శాసన బద్ధంగా జీవించలని కోరుకున్నారు .రాజ్యం భవితవ్యలు మార్చు కున్న కొద్ది రాజనీతి శాస్త్ర పరిధి విశాల మావుతూ ప్రభుత్వనికి సంభందించిన అనేక అంశాలు ఇందులో చేరాయి.
            రాజనీతి శాస్త్ర  పరిధిలో సుస్థిరమైన సమాజం , ప్రభుత్వం , రెండు ముఖ్యమైన చర్చనియoశాలు  రాజ్యం  మనవ జీవితంలో కీలక పాత్ర వహించడం వల్ల రాజ్యధికార సిద్ధాంతానీ చర్చించి వ్యక్తి సంస్థలకు గల సంబంధాలను ఈ శాస్త్రం చర్చిస్తుంది . రాజ్యానికి గల భూత ప్రవర్తన విషయాలు సమగ్రంగా పా పరిశీలించిన తర్వాత   రాజనీతి శాస్త్రo  భవిష్యత్తును  గురించి అన్వేషణ జరుపుతుంది రాజ్యం  కేవలం జీవించడం కొరకు మాత్రమే కాదని , ఉత్తమ జీవిత సాధనమే రాజ్యం లక్ష్యం అని అరిస్టాటిల్ ప్రకటించటం ద్వారా రాజనీతి శాస్త్ర పరిధి ఎంత విస్త్రుతమైనదో గోచరిస్తుంది .
           రాజనీతి శాస్త్రo  రాజ్యాన్ని  వివిధ స్థాయిలో అధ్యయనం  చేస్తుంది  ఉదా:- రాజ్యం అంతరంగిక వ్యవహారాలను ఒక  విధంగా చర్చిస్తే  మరో విధంగా రాజ్యం బాహ్య  సంభందాలను కూడా అధ్యయనo చేస్తుంది. ప్రాంతీయ, జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో వివిధ అంశాలను విడి విడిగా  అధ్యయనం చేసే భాగాలూ  రాజనీతి శాస్త్రo పరిగణిoచింది.
           రాజ్యం, రాజకీయ భావాలు ఆదర్శాల ప్రతిబింబమే కాబటి రాజనీతి శాస్త్రo గత రాజకీయ భావాలను పరిశీలించి, అవి ఆచరణాత్మక రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో వివరిస్తుంది. రాజ్యాని గురించి చర్చించే తప్పుడు  రాజనీతి శాస్త్రo   ప్రధానంగా చట్ట బద్దమైన సామజిక విశ్లేషణను పరిగణలోకి తీసుకుంటుంది. ప్రారంభ దశలో ఈ  శాస్త్రం రాజ్యం మౌలిక సూత్రాల గురించి వివిధ సంస్థల నిర్వహణ గురించి అధ్యయనం చేస్తూ వచ్చింది.
          గ్రీకులు భావించినట్లు   రాజనీతి శాస్త్రాన్ని రాజ్య భివృద్ధికి సర్వోన్నత శాస్త్రాo గా పరిగణిoచవచ్చు . రాజకీయ భావాలను ప్రక్రియ లను నిర్వహించే వాస్తవ విజ్ఞాన శాస్త్రం గా రాజనీతి శాస్త్ర పరిధి ప్రపంచమంతా వ్యాపించిoది.
రాజనీతి శాస్త్రo  - ప్రాధాన్యత :-
ఆధునిక ప్రజాస్వామ్యo లో రాజనీతి శాస్త్రo   ప్రాముఖ్యత ఈ క్రింది విధంగా వివరంచ వచ్చు .
1. ప్రభుత్వ విధానాల రుప్పకల్పన :-
      వర్తమాన రాజకీయాలలో ప్రభుత్వ విధనాల రూపకల్పన చేయటానికి, వాటిని ఆచరణలో పెట్టడానికి ఒక ఆదర్శ రాజకీయ శాస్త్రానికి నిర్మాణo ఎంతైనా అవసరం. రాజకీయ సిద్దంతాలను రుపొందిచడం లో రాజనీతి శాస్త్రనికి ఏంటో ప్రాధాన్యత ఉంది . ప్రజాస్వామ్యo లో ప్రజలకు రాజకీయ సామజిక , ఆర్థిక  సమస్యల పరిష్కారంలో ప్రముఖ పాత్ర నిర్వహించ లేరు .
2. విభిన్న ప్రభుత్వ స్వరూపాల అధ్యయనానికి మూలాధారం:-
      రాజనీతి శాస్త్రo అధ్యయనం వల్ల వివిధ ప్రభుత్వల ఫై రాజకీయ పరిజ్ఞానం, రాజ్యాంగ బద్ధమైన అవగాహనన్ని కలుగుతుంది. ఉదా:- రాజరికo, కూలిన పాలన, అల్ప జనపాలన , ప్రజాస్వామ్యo, నియంతృత్వం మొ || వివిధ రకాల ప్రభుత్వాల గురించి అధ్యయనం చేయడమే కాకుండా ప్రభుత్వ నిర్మాణం, ప్రభూత్వ అంగాలైన శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయ శాఖ, వాటి విధుల గురించి తులనాత్మక దృక్పథంలో అన్ని విషయాలను స్పష్టంగా వివరిస్తుంది .
3. రాజకీయ వ్యవస్థలు, సిద్ధాంతాల పట్ల అవగాహన :-
      ప్రజాస్వామ్య ప్రభుత్వ యంత్రంగాన్ని క్రియాశీలo చేస్తూ ఉంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ జయ ప్రదం కావాలంటే రాజకీయ పక్షాలు ప్రభూత్వ విధానాలు ప్రజా ప్రతినిధులు , ప్రభావ వర్గాలు ఎలా వ్యవహరించాలో  రాజనీతి శాస్త్రo  అధ్యయనం ద్వరా తెలుస్తుంది .
4. జాతీయ , అంతర్జాతీయ సంభందాల అధ్యయనం:-
      పౌర సముదాయo  వల్ల జాతీయ నిర్మాణానికి రాజనీతి శాస్త్రo  గట్టి పునాదులువేసింది .జాతీయ రాజ్య భావన లో పాటు పరిణితి చెందిన ప్రజాస్వామ్య దేశాలు , మిశ్రమ ప్రభుత్వాలు, లేదా సంకీర్ణ ప్రభుత్వాల వైపు తమ దృష్టిని మళ్లిస్తున్నాయి .
5. ప్రపంచ రాజకీయలకు మార్గదర్శి;-
     జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలతో పాటు ప్రపంచ దేశాల రాజకీయాలకు రాజనీతి శాస్త్రo  మార్గదర్శిగా నిలిచింది. మిత్ర దేశాల మధ్య రాజకియే తర సంభందాలు ఏర్పడి రాజనీతి శాస్త్ర ప్రాధాన్యతను మరింత ఇనుమడింప చేసింది . అంతర్జాతీయ సంభందాలు జటిలమైనప్పుడు  అవి రాజకియలుగా మారుతాయి. ఉదా:-దక్షిణా ఆఫ్రికా, నైజీరియా , కంపూచియ , శ్రీలంక లోని జాఫ్న , భారత దేశం లోని జమ్మూ కాశ్మీర్ వంటి సమస్యలు ప్రపంచ దేశాల దృష్టి ని ఆకర్షస్తునాయి .
6. ప్రధామిక హక్కుల పరిరక్షణ :-
      ఆధునిక సమాజంలో రాజ్యం ప్రజలకు ప్రసాదించిన ప్రధామిక హక్కుల ప్రాముఖ్యతను, ప్రాధాన్యత ను రాజనీతి శాస్త్రo స్పష్టంగా తెలియ జేస్తుంది. మనవ సమాజానికి అనుకూల మైన హక్కులు , భాద్యతుతమేనా ప్రజాస్వామ్య వ్యవస్థ లో మాత్రమే రాజనీతి శాస్త్రo  ద్వారా తెలుస్తుంది.
7. రాజకీయ చైతన్యానికి నిదర్శనం:-
      ప్రభుత్వ విధనాల  రూపకల్పన, ప్రజల ఆలోచనలు, కోరికలను ప్రతిబింబించే టట్లుచూడాలంటే రాజ్యాధికార నిర్మాణంలో ప్రభుత్వ పాలనా యంత్రాంగంలో  ప్రజా ప్రతినిధులు , కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, స్వచ్ఛంద సేవా సంస్థ చిత్త శుద్దిలో పాల్గొనటానికి రాజనీతి శాస్త్ర అధ్యయనం దోహద కాగలదు . రాజ్యంలో నివసించే పౌరులు తమ వ్యక్తిత్వ వికాసం సాదించ దానికి రాజనీతి శాస్త్రo   బాగా తోడ్పడుతుంది .
ముగింపు:-
        ప్రజాస్వామ్యంలో ప్రధామిక హక్కులు కలిగిన ప్రజలు ప్రభుత్వ పరిపాలనలో ప్రజాసంక్షేమo కొసం సరియైన నిర్ణయాలు తెసుకోవటానికి   రాజనీతి శాస్త్ర భోదనలు , విషయ పరిజ్ఞానం మనవ జాతికి ఎంతైనా అవసరం .
2) రాజనీతి శాస్త్ర అద్యయన  పద్దతులు రాయండి ?
A) పరిచయం :-
      రాజనీతి శాస్త్ర అధ్యాయం లో ఒక కచ్చితమైన పద్దతి కనిపించదు.19 వ శతాబ్దం వరకు అమలు పరిచిన అధ్యయన పద్దతులను సంప్రదాయ పద్దతులు అని పిలిచేవారు. రెండో ప్రపంచ యుద్ధనంతరం రాజనీతిలో ప్రవేశ పెట్టిన పద్దతులను ఆధునిక పద్దతులు అని అంటారు .
(1)  సంప్రదాయక అధ్యయన పద్దతి:-
      రాజనీతిశాస్త్ర అధ్యయన పద్దతుల్లో సంప్రదాయ పద్దతులు అత్యంత ప్రాచీన మైనవి . ఈ పద్దతి ఎక్కువగా రాజకీయ విలువల ఫై ఆధార పడి ఉండేవి.
a)  తాత్విక పద్దతుతి :-
      తాత్విక పద్దతి అత్యంత ప్రాచీనమైన అద్యయన పద్దతి. ఒక సాధారణ సూత్రాని రూపొందించి దాన్ని వాస్తవాలకు అన్వయించడం.ఈ పద్దతిలో ప్లేటో, రూసో, హెగెల్ , క్యాoట్, వంటి పండితులు సుప్రసిద్ధ వాఖ్యతలు అని చెప్పవచ్చు . ప్లేటోతన “రిపబ్లిక్” గ్రంధంలో తాత్వక  ప్రభువులే రాజ్యాన్ని నిర్మించి తద్వారా వాస్తవ రాజ్యాలను రూపొందించడానికి గట్టిగా ప్రయత్నించాడు . ఇతడు ప్రతిపాదించిన తాత్విక పద్దతిని అనుసరించిన రూసో , బోసంకే , క్యాంట్ వంటి పండితులు తాత్విక  పద్దతిని అనుసరించి రాజకీయ భావలను పరిశీలించారు .
బి) చారిత్రక పద్దతి :-
      చారిత్రక పద్దతి గత సంఘటిన లఫై , పరిణామాత్మక దృష్టిని సేకరిస్తుంది .రాజనీతి శాస్త్ర అధ్యయన పద్దతిలో చారిత్రక పద్దతి చాలా విలువైనది  రాజనీతిశాస్త ప్రయోగాలకు చరిత్ర అదార్యం కాబట్టి చరిత్రక పరిశీలనఫై న అనుభవాల ఫై రాజనీతి శాస్త్ర ప్రయోగాలూ ఆధార పడి ఉంటాయి .
సి ) న్యాయ శాస్త్ర పద్దతి :-
       రాజ్యం ఒక సాంఘిక సంస్థ అని  చట్ట బద్ధమైన సిద్దాంతలతో రూపొందించ బడినదని న్యాయ శాస్త్రజ్ఞులు గుర్తించారు. రాజ్యం అధికారంలో కూడిన న్యాయ సూత్రాల సమేళనం న్యాయశాస్త నిపుణులు పేర్కొన్నారు. రాజ్యం లో శాంతి భద్రతల పరిరక్షణ, న్యాయ వ్యవస్థకు సంభందించిన సంస్థ ల పరిధి , స్వేచ్ఛా సమానత్వం గురించి  అధ్యయన పద్దతినే న్యాయశాస్త్ర పద్దతి అని అంటారు .
డి) సంస్థాపక  పద్దతి:-
     వర్తమాన రాజనీతి పండితులు సంస్థాపక పద్దతిని సంప్రాదాయక  పద్దతిలో ఒక భాగం అనుసరిస్తూన్నారు. సంస్థాపక పద్దతి వైఖరిలో శాసన  సభ , న్యాయ శాఖలకు సంభందించన లాంచన  నిర్మాణాల గురించన విషయాలఫై అధ్యాయాన్ని కేంద్రికరిస్తున్నారు.
2) ఆధునిక పద్దతులు :-
      ప్రముఖ  శాస్త్రజ్ఞులు W.A.ROBSON రాజనీతి శాస్త్రాన్ని ఆధునిక పద్దతుల అధ్యయనంలో కూడిన శాస్త్రం గా వర్ణించాడు .
) వ్యవస్థాగత పద్దతి:-
      వ్యవస్థాగత అధ్యయన పద్దతి అధునాతనమైనది. ఒక వ్యవస్థను సమగ్రంగా అధ్యయనం చేయాలంటే దానికి సంభందించిన పూర్తి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడమే వ్యవస్థాగత పద్దతిగా ఆచరణలోకి వచ్చింది. ఈ పద్దతిలో అన్ని వ్యవస్థ లు పరస్పర పోషకాలుగా ఉంటాయి . వాటిని సమగ్రంగా అధ్యయనం చేసినప్పుడు ఒక వ్యవస్థ స్వభావాన్ని అర్థ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది.
బి ) నిర్మాణ విధుల పద్దతి:-
    రాజకీయ వ్యవస్థల విశ్లేషణ ద్వారా నిర్మాణ విధుల పద్దతి ఆవిర్భావించింది. ఈ పద్దతి రాజకీయ వ్యవస్థలోని వివిధ నిర్మితుల ను , అవి నిర్వహించే  ప్రధామిక విధులను సమగ్రంగా అధ్యయనం చేస్తుంది . మనవ సమాజం పరస్పర ఆధారిత వ్యవస్థ అని , ఈ వ్యవస్థలో ప్రతి నిర్మాణo ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహిస్తుందని , నిర్మాణ విధుల పద్దతి పేర్కొంటుంది.
సి) న్యాయశాస్త్ర పద్దతి:-
    రాజ్యం ఒక సంఘక  సంస్థ, అని , చట్ట బద్ధమైన సిద్దాంతలతో రుపొందిచ బడింది అన్ని న్యాయశాస్త్రజ్ఞులు గుర్తించారు. రాజ్యం అధికారంలో  కూడిన న్యాయ సూత్రాల సమ్మేళనమని న్యాయ శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు . రాజ్యం లో శాంతి భద్రతల పరిరక్షణ, న్యాయ వ్యవస్థకు సంభందించిన సంస్థ ల పరిధి . స్వేచ్ఛా, సమానత్వo గురించిన అధ్యయన పద్దతినే న్యాయ శాస్త్ర పద్దతి.
డి) సంస్తాపక  పద్దతి:-
     వర్తమాన రాజనీతి పండితులు సంస్థాపక పద్దతిని సంప్రదాయక పద్దతిలో ఒక భాగంగా అనుసరిస్తునారు .సంస్థాపక పద్దతి విఖరిలో  శాసన సభ , న్యాయ శాఖలకు సంభందించిన లాంచన నిర్మాణాల గురించిన విషయాలఫై అధ్యాయాన్ని కేంద్రికరిస్తున్నారు.
) శాస్త్రీయ పద్దతి:-
        రాజనీతి శాస్త్రం లోని అధ్యయన పద్దతి అత్యదునికమైనది. రాజనీతిలోని తాత్విక సమస్యలను సిద్దాంతాలను , శాస్త్రీయంగా అర్థం చేసుకోవడానికి ఈ పద్దతి విశేషంగా ఉపకరిస్తుంది
శాస్త్రీయ పద్దతిలో విషయ నివేదన కు అనుకూలించే కొన్ని ప్రధాన సాధనాలు ఉన్నాయి.
1) పరిశేలన :- పరిశేలన ద్వారా రాజకీయ వ్యవస్థలోని అన్ని విషయాలలో భాగస్వామ్యంగా పాల్గొని వాస్తవాలను ప్రతిబింబిoటకు ప్రయత్నిస్తుంది .
2) వర్ణన :- పరిశీలించిన విషయాన్ని వర్ణించి ఆ వర్ణన యదార్ధo గా తగినంతగాను ఉందొ లేదో పరిశీలిస్తుంది. వర్ణన వాస్తవికతను తెలుసువడానికి తోడ్పడుతుంది.
3) పరిక్ష:-  పరిక్ష శాస్త్రీయ పద్దతి మరొక లక్షణం ఆచరణ లోని సిద్ధాంతాలను పరిశిలిoచడానికి  ఈ పద్దతి తోడ్పడుతుంది.
4 ) సవరణ:- వాస్తవాలను తెలుసుకొనే టపుడు  కొని సవరణలు శాస్త్రీయ పద్దతికి బలాన్ని చేకూరుస్తాయి .
5 ) జోస్యం:- గత అనుభవాలను బట్టి వర్తమాన పరిస్దితులను  పరిశీలించి భవిషత్తు పరిణామాలను ఉహించడమే జోస్యం.
ముగింపు:-
 రాజనీతి శాస్త్ర అధ్యయన సారాంశమే రాజనీతి విశ్లేషణ. ఆధునిక రాజకీయ ప్రక్రియలలో రాజనీతి విశ్లేషణ రఅని వార్యం . అనుభావక పూర్వక విశ్లేషణ రాజకీయ వస్తావని వివరిస్తుంది. సూత్రాన ప్రాయ విశ్లేషణ భవిష్యత్ వ్యవస్థను, విపులికరిస్తూoది. విధాన విశ్లేషణ ప్రస్తుత  రాజకీయ వ్యవస్థ నుంచి ఉత్పన్నమైన విషయాలను వివరిస్తుంది.
3) రాజ్యం యెక్క ముఖ్య లక్షణాలు వివరింపుము?
A) పరిచయం:-
     16వ శతాబ్దంలో ఇటలీకి చెందిన ప్రముఖ రాజనీతి శాస్త్ర పండితుడు  మఖియవెల్లి రాజ్యానికి పెరుగుతున్న ప్రాముఖ్యతను వివరించాడు.16 వ శతాబ్దం తర్వాత జాతీయ రాజ్యాలు ఏర్పడాయి .
రాజ్యం – నిర్వచనాలు:-
1) “ఒక నిర్ణీత  భూభాగం లో శాసన బద్ధ మైన ప్రభుత్వం గల పౌర సముదాయమే  రాజ్యం “
2) “ ఒక నిర్ణీత ప్రదేశoలో నివసిస్తూ రాజకీయo గా వ్యవస్థాపితమేనా ప్రజా సముదాయమే రాజ్యం “-బ్లుంట్ శిలే
ప్రధాన లక్షణాలు:-
    ఆధునిక రాజ్యాన్ని పరిశీలించినప్పుడు దాని నిర్వచనం ప్రకారం రాజ్యా నికి నాలుగు ప్రధాన లక్షణాలు ఉన్నాయని గోచరిస్తుంది
1) ప్రజలు
2) ప్రదేశం
3 ) ప్రభుత్వం
4 ) సార్వభౌమాధికారం
1 ) ప్రజలు :-
      ప్రత్యక్ష ప్రజాస్వామ్యవాది రూసో తన ఆదర్శ రాజ్య  సంఖ్య 10,000 లకు మించ కూడదని భావించాడు రాజ్యం లో ప్రజలను పోషించ గల సంఖ్య లో మాత్రమేజనాభాఉండాలని గెటిల్ అనే రాజనీతి శాస్త్ర పండితుడు  అభిప్రాయ పడ్డాడు. రాజ్య వ్యవస్థకు , అధికారాల రూపకల్పనకు ప్రజలే మూలాధారం. ప్రజల రక్షణయే రాజ్య వ్యవస్థకు ప్రధాన లక్ష్యం  కాబటిప్రజల సంఖ్య కు ప్రాముఖ్యత లేదని కొందరు భావించాడు. చైనా పీపుల్స్ రిపబ్లిక్, మోనాకో అనేవి రెండు స్వతంత్ర రాజ్యాలు , వాటి జన సంఖ్యలో వ్యత్యాసాo గోచరిస్తుంది. చైనా  జనాభా 100 కోట్లకు ఫై గా ఉండగా , మోనాకో కొని లక్షలకు మాత్రమే పరిమితమైనదిని తెలుస్తుంది .
2 ) ప్రదేశం లేదా భూభాగం:-
      ప్రదేశం లేదా భూభాగం రాజ్యం రెండవ లక్ష్యం. ప్రజలో పాటు ప్రదేశం రాజ్య అవతరణ కు జాతి పురోగతి కి ప్రధాన సాధనం , ఒక రాజ్యం ప్రాముఖ్యత సాధించడంలో ప్రదేశం అత్యంత ప్రాముఖ్యత ఉంది .ఉదా:- సంచార జాతుల వారికి, వలస వెళ్ళే వారికి,జిప్సీ లకు రాజ్యం ఉండదు.ఒక నిర్దిష్టమైన ప్రదేశం లేక పొతే రాజ్యం ఏర్పడదు.అర్థక వనరులతో కూడిన నాణ్యతగల  ప్రదేశంరాజ్య అవతరణకు మూలాధారం. సెయింట్ మారినో రాజ్య విస్తరణ 38 చ .మై .ళు, వాటికన్ సిటీ విస్తరణ 100 చ .మై .ళు , ఆమెరికా సంయుక్త రాష్ట్రాల విస్తీర్ణం 35 లక్షల చ .మై కు పెరిగింది.
3 ) ప్రభుత్వo:-
       రాజ్య న్నికి ప్రభుత్వo  ప్రాణం వంటివి.రాజ్యం పాలనా యంత్రాంగమే ప్రభుత్వo. రాజ్య విదానాలును అమలు పరిచే సంస్థ ప్రభుత్వo. ప్రజా జీవితానికి అవసర మైన శాసనాలు, కార్యనిర్వాహణప్రభుత్వo ద్వారా అమలులోకి వస్తాయి . ప్రముఖ శాస్త్రజ్ఞులు లికాక్ అభిప్రాయ పడినట్లు ప్రభుత్వ o లేకుండా నాగరిక జీవనమే అసాధ్యం అవుతుంది.
4 ) సార్వభౌమాధికారం:-
       రాజ్యం లక్షణాలలో సార్వభౌమాధికారం అత్యంత ముఖ్యమైన మౌలిక లక్షణం . రాజ్యాన్ని గుర్తించడానికి సార్వభౌమాధికారం మూలాధారం.రాజ్యనికి మాత్రమే ఈ లక్షణం ఉంటుంది.రాజ్యాన్ని గల అత్యునతనమైన అధికారం అని అర్థం.
సార్వభౌమాధికారం రెండు రకాలుగా విభజించ వచ్చు  అవి :-
1 ) అంతర్గత సార్వభౌమాధికారం
2 ) బాహ్య  సార్వభౌమాధికారం.
 ముగింపు:- ఫై న చర్చించిన రాజ్యం  యొక్క లక్షణాల తో పాటు అంతర్జాతీయ గుర్తింపు అను 5 వ లక్షణం కూడా కలదు. రాజ్యానికి ఉన్న లక్షణాలలో సార్వభౌమాధికారం అనేది అతి ముఖ్యమైన లక్షణం .  
4) సంఘం రాజ్యం మధ్య  సంబంధాo  గురించి చర్చించoడి ?
సంఘం
రాజ్యం
1) సంఘం రాజ్యని కి నుంచే అవతరించింది.వ్యక్తి  వికాసానికి సాధన మైనది
1) సంఘం తర్వాత రాజ్యం అవతరించింది. వ్య్వస్తీ క్రుతమేనా మనవ వికాసానికి రాజ్యం ఏర్పడింది .
2) సంఘం మానవుని సహజ ప్రేరణ వల్ల ఏర్పడ్డ మనవ సంస్థ.
2) రాజ్యం మానవుని ఉన్నతి కొసం ఏర్పడ్డ  ఒక రాజకీయ వ్యవస్థ .
3) సంఘం ఆర్థిక సామజిక భాద్యతతో రుపొందిచడం జరిగింది .
3) రాజ్యం మనవ ఆశయాలు , లక్ష్యాలను సిద్ధించడం కొసం ఏర్పడింది .
4) సంఘo  ఒక  నిర్దిష్ట మైన ప్రదేశానికి  మాత్రమే పరిమితమైనది కాదు .
4) రాజ్యం ఒక నిర్దిష్ట మైన  ప్రదేశానికి  పరిమితమైనది .
5) సంఘనికి సార్వభౌమాధికారం లేదు , ప్రజలఫై  నైతిక ఒత్తిడి మాత్రమే చేయగలదు .
5) రాజ్యాన్నికి  మాత్రమే సార్వభౌమాధికారం. ప్రజలకు దండించే  అధికారం కలదు.

5 )   రాజ్యం , ప్రభుత్వం  మధ్య భేదాలు తెల్పండి ?
రాజ్యం
ప్రభుత్వం
1) రాజ్యనికి స్వతః సిద్దమేనా  రూపం  లేదు .
1) ప్రభుత్వమే రాజ్యానికి జీవనాధారం. ప్రభుత్వ ప్రతినిధులు  కేటాయించిన అధికారాలు నిర్వహిస్తారు .
2) రాజ్యం ప్రజా సముదాయం తో ఏర్పడ్డ రాజకీయ వ్యవస్థ.
2) ప్రభుత్వం పరిమితమైన  సిద్ధాంతo గల రాజ్యాంగం.
3) రాజ్యం స్తిరమైoది, దీనిలో ప్రజలు , ప్రదేశం, ప్రభుత్వం , సార్వభౌమాధికారం నే నాలుగు ప్రధాన లక్షణాలు కలదు. 
3) ప్రభుత్వ o రాజ్యం ప్రధాన లక్షణాలలో ఒక భాగం మాత్రమే దీనికి సంపూర్ణ అధికారాలు లేవు .
4) రాజ్యం  స్థిరమేనాది
4) ప్రభుత్వ నిర్మాణo ప్రజల అభిష్టం ఫై ఆధారపడి ఉంటుంది
5)  పౌరులు రాజ్యాన్నికి తప్ప కుండా విదేయులే ఉండాలి .
 5) ప్రజా స్వామ్య రాజ్యం లో ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శo చే హక్కు ప్రజలకు ఉంది .
6) ఒక నిర్దిష్ట  ప్రదేశంలో నివసించే ప్రజలందరి కొసం ఏర్పడ్డ  సంస్థ.
6) ప్రభుత్వం రాజ్యం ఇచ్చిన ఆదేశాలను అమలు చేస్తుంది .
7) రాజ్యం శాశ్వత సంస్థ .
7) ప్రజల విశ్వాసం ఉన్నoత వరకు ఇది కొనసాగుతుంది .

(6)  జాతి- జాతీయత యెక్క లక్షణాలు ఏవి  ?
A)  పరిచయం:-
      రాజనీతి శాస్త్ర పరిభాషలో జాతి అనే పదం లాటిన్  పద మైన “నెషియో” (NATIO) నుంచి ప్రచారంలోకి వచ్చింది . నెషియో అనగా ‘ప్రజలు’ అని అర్థం . ఈ పదాన్ని ఆంగ్లేయులు , జర్మన్ లు ప్రప్రధమo గా వాడుకలోకి తెచ్చారు. జర్మన్లుల అభిప్రాయoలో నేషియో అనగా ప్రజల్లో ఏకత్వo సాధించడం అని  అర్థం. ఆధునిక ప్రపంచంలో రాజ్యాధికార సిద్ధాంతo లో జాతి ఒక శక్తి వంతమమైనా అంశంగా అవతరించింది.
నిర్వచనాలు:-
1) ఒక  ప్రజా సముదాయo లో  కలిసి జీవించాలానే వాంఛను జాతీయ భావమని ప్రముఖ చరిత్రకారుడు టాయన్ బీ నిర్వచించాడు . ఇదే భావాన్ని లాస్కి అనే పండితుడు  స్పష్టంగా పెర్కొనాడు . ఆయన అభిప్రాయంలో జాతీయ భావం అనేది , ఒక ఆధ్యాత్మిక భావన మాత్రమే .
జాతీయత- ముఖ్య లక్షణాలు:-
1 ) ఒకే జాతి :-
     మనవ సమాజం లో ఒకే జాతి , బంధుత్వం , రక్త సంభందం , మత సిద్దంతాలు ప్రజలో జాతీయ భావాన్ని పెంచుతాయి . ఒకే రక్తాన్ని పంచుకొని పుట్టా మనే భావం ప్రజల మధ్య స మై క్యతను సాధిస్తుంది. జాతీయతకు  సాధిస్తుంది. జాతీయటకు అత్యంత ప్రధానమైన అంశం . ఒకే సంతతి , ప్రాచీన కాలంలో ప్రజల మధ్య ఏర్పడ్డ రక్త సంభందాలు సమైక్యతా భావాన్ని పెంపొందించాయి .  
2 )ఒకే మతం :-
     మతం అనేది ఒక జీవిత విధానం . జాతీయతను మరింత ప్రతిష్టావంతo చేయడంలో మతం కీలక పాత్ర వహిస్తుంది.ప్రాచీన కాలంలో ప్రజల జీవిత విధానం మతపరమైన ఆచారాలలో , కర్మ సిద్దంతాలతో కొనసాగింది . ఆధునిక  యుగ ప్రారంభంలో తిరుగుబాటు ఉద్యమం ఏర్పడి జాతీయ రాజ్యాల అభివృద్ధికి దోహద పడింది .
3) ఒకే భాష :-
        ప్రజల్లో సంస్కృతిక సమేక్యాతను సాధిoచడంలో భాష నిర్మాణాత్మకమైన పాత్రను పోషిస్తుంది. వివిధ భాషలు మాట్లాడే ప్రజలు ఒకరి భావాలు అర్థంచేసుకోవడానికి భాష ఒక ప్రధానమైన సాధనo . వివిధ భాషలు మాట్లాడే ప్రజల్లో భావ సమేక్యాతను సాధించడం సులబ సాధ్యం కాదని కొందరు అభిప్రాయపడ్డారు .స్విస్ దేశం లో ని ప్రజలు , జెర్మనీ, ఫ్రెంచి, ఇటాలియన్, భాషల ను మాట్లాదినపుడికి  ఆ దేశ ప్రజలో జాతీయతా  భావం లోపించలేదు .
4) భౌగోళిక సానిహిత్యం :-
      జాతి  నిర్మాణానికి , ప్రగతికి  మనుగడకు భౌగోళిక సానిహిత్యం చాలా అవసరం . ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే ప్రజలు తమ ప్రదేశాన్ని  మాతృ భూమిగా పరిగణిస్తారు. అలంటి ప్రజల్లో మానసిక, భౌతిక, సంస్కృతిక లక్షణాలు ఏర్పడి వాటిలో పరస్పర అవగాహన సానుభూతి  సోదర భావం ఏర్పడి జాతీయ భావాలు స్థిరపడే  అవకాశాలు ఉన్నాయి .
5 ) ఒకే చరిత్ర – ఆచారాలు :-
     ఒకే విధమైన చారిత్రిక పరిమాణాలు ఆచార వ్యవహారలు ఒకే భాష . ఉమ్మడి అనుభవాలు ప్రజల్లో జాతీయ భావాన్ని పెంపొంది స్తాయి .చారిత్రిక వై భావం, స్మృతులు, ఆచారలు, జాతీయ భావాన్ని ప్రోతహిస్తాయన్ని జె .ఎస్ .మిల్ అభిప్రాయ పడ్డాడు. “ దిని వల్ల ఒకే రకమైన ఆర్థిక ప్రయోజనాలు జాతి సమేక్యాతను బల పరుస్తాయి” అని ఆయన భావించాడు. ఒకే జాతిలో నివసించే ప్రజలు ఒకే విధ మైన ఆచార సంప్రదాయలు ద్వార తమ కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటారు.
6) ఉమ్మడి లక్ష్యాలు :-
       ప్రజలు జీవిత అవసరాలకు ఉమ్మడి లక్ష్యాలు ఒకే ప్రజా సముదాయలో సమేక్యాత భావాన్ని రుపొందిచవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు రక్షణ పరంగా , ఆర్థిక పరంగా ఏర్పడా వొచ్చు . ఉమ్మడి లక్ష్యాల ద్వారా స్వతంత్ర భావాలు పెరిగి ప్రజల సంఘటితులే  జాతీయతా భావం ఏర్పడుతుంది. ప్రజలు ఉమ్మడి లక్ష్య సాధన కొసం స్వతంత్ర జాతీయ రాజ్యాలు అవతంచా యని  చెప్పవచ్చు.
7) ఒకే స్థిర నివాసం:-
      ఒక ప్రత్యేక భూభాగంలో ప్రజలు స్థిర నివాసం ఏర్పడుచుకున్న ప్పుడు  జాతీయ సమేఖ్యతను పెంపొందు కుందనే అవకాశాలు అధికంగా గోచరిస్తాయి. ఒకే స్థిర నివాసం వల్ల ప్రజల్లో స్థానిక అనే భావన ఏర్పడి జాతీయత భావం ఏర్పడు తుంది . విభిన్న జాతులు, తెగలు ఏర్పడి నప్పుడికి వారందరూ ఒకే ప్రాంతంలో స్థిర నివాసు లై  ఉన్నట్లుయితే జాతీయత భావం ఏర్పడ్డి ప్రజలందరూ ఏక మై తమ ప్రాంతాన్ని అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నిస్తారు.
8) ఉమ్మడి ప్రభుత్వం :-
       ప్రజల మధ్య ఎంత వైరుధ్యo ఉన్నప్పడికి, ఒకే ప్రభుత్వం లో నివసించడం ద్వార ప్రజల్లో జాతీయత భావం ప్రతిభింబిస్తుంది  అనాది కాలంగా ప్రజలు ఒకే ప్రభుత్వనికి విదేయులు గా ఉంటూ ఆ ప్రభుత్వ విధానాలను అనుసరిo చినప్పుడు ఆ ప్రజల్లో జాతీయత భావం గోచరిస్తుంది. కొని సందర్భల్లో  ఉమ్మడి రాజకీయ లక్ష్యం ఉమ్మడి ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల ను సమేక్యా పరుస్తుంది.
ముగింపు:-
ఆసియా, ఆఫ్రికా,లాటిన్ ఆమెరికా దేశాలు స్వతంత్ర జాతీయ పోరాటాలు జాతీయ భావాలు మరింత శక్తి వంతం చేశా యి

సార్వభౌమాధికారం
7 ) సార్వబౌమాదికరం నిర్వచించి ప్రధాన లక్షణాలు వివరించండి ?
A) పరిచయం:-
             రాజనీతిశాస్త్ర విషయ పరిజ్ఞానం లో సంఘం , జాతి, జాతీయత, రాజ్యం ,ప్రభుట్వంతో పాటు సార్వభౌమత్వం అతున్నాత్త మైన సిద్దాంతం అవతరించింది. 16 వ శతాబ్దానికి చెందిన జీన్ బోడిన్ అనే ఫ్రెంచ్  రాజనీతి తత్వవేత్త సార్వభౌమత్వాన్ని గురించి వివరించిన వారిలో అగ్రగణ్యుడు. ప్రజలు , పాలితులఫై ఉన్న  సర్వోతోన్నత అధికారాన్ని సార్వభౌమత్వం అని బోడిన్ తన రచించిన six books on the state”,  అనే గ్రంధంలో నిర్వచించాడు. 17వ శతాబ్దంలో డచ్ న్యాయ శాస్త్రవేత్త  హ్యూగో గ్రోషియస్ బాహ్య సార్వభౌమాధికారం గురించి వివరించాడు.
అర్థo :-
      సార్వబౌమాదికరంఅనే ఆంగ్ల  పదం “సుపరానస్” (superanus) అనే లాటిన్ పదం నుంచి ఆవిర్భావించింది . సుపరానస్ అనగా “అతున్నత మైనది” అనే అర్థం . శాసనాలను రుపొందిచదానికి బల ప్రయోగతోనేనా వాటిని అమలు చేయడానికి రాజ్యానికి గల అత్యున్నత అధికరాన్నే సార్వబౌమాదికరం అని అంటారు . ఆధునిక రాజనీతి విజ్ఞాననికి , ప్రభుత్వ విదానాల రూపకల్పనకు సార్వబౌమాదికరం మూలాధారం అని చెప్పవచ్చు .
సార్వబౌమాదికరం నిర్వచనాలు :-
1)    “అతున్నత శాసనాధికారాలు  ఎవరితో ఉంటాయో  అటువంటి అత్యున్నత, అపరిమిత,అదుపులేని  అధికారమే సార్వబౌమాదికరం”—బ్లాక్ స్టోన్  అభిప్రాయపడ్డాడు.
2)    “ సర్వబౌముడు ప్రజలు కిచ్చిన అజ్ఞలే చట్టo “- --ఆస్టిన్
3)    పాలితులఫై న , పాలితుల సంఘా ఫై న స్వతః సిద్ధ , నిరపేక్ష, అపరిమితఅధికారాన్ని సార్వబౌమత్వం “—బర్గన్ .
సార్వబౌమాదికర లక్షణాలు:-
        సార్వబౌమాదికరం నిర్వచనాలను అవగాహన చేసుకున్న తరవాత దాని ముఖ్య లక్షణాలను సార్వభౌమత్వం గల ప్రధాన లక్షణాలను ఈ క్రింది విధంగా పెర్కొనవచ్చు .
1)    నిరపేక్షత
2)    సార్వజనీనత
3)    శాశ్వతత్వం
4)    అనన్య సంక్రమ తత్వం
5)    అవిభాజ్యత
ఫై న పేర్కొన్న లక్షణాలను ఈ విధంగా చర్చించవచ్చు
1)  నిరపేక్షత :-
 రాజ్యం లో అదుపులేని సార్వబౌమాదికరన్ని నిరపేక్షత  అధికారం అంటారు . రాజ్య పరిధిలో సార్వబౌమాదికరం మించిన మరొక అధికారం ఉండదు. రాజ్యం లో నివసించే సంస్థ ఫై , ప్రజల ఫై , వ్యవస్థల ఫై దేని అధికారం  నిరపేక్షమైనది. కొందరి న్యాయవేత్తల అభిప్రాయo లో ఎటువంటి ఆంక్షలు విధించా లేని అధికారం సర్వభౌమత్వం అని పేర్కొనటం జరిగింది.
2) సార్వజనీనత ;-
సార్వబౌమాదికరం రెండవ లక్షణం , రాజ్యం లోని ప్రజలు మీద సంస్థల మీద ఎలాంటి పరిమితులు లేకుండా అధికారం చెలించ బడి కావడానికి సార్వజనినత  అని అంటారు .
ముగింపు:-
         ఆధునిక ప్రజాస్వామ్యంలో పెరుగుతున్న ఆర్థిక, సాంఘిక, రాజకీయ, సంస్కృతిక సంఘాల ప్రాముఖ్యత బహుత వాదులు గుర్తించారు.సహజ కార్యకలాపాలను వివిధ పాత్రలను భాహుతవాదం గుర్తించింది .
8 ) సార్వబౌమాధికరం రకాలు తెల్పండి ?
a)    న్యాయబద్ద సార్వబౌమాదికరం:-
చట్ట రిత్య శాసనాలు చేసే అధికార మున్న వారికి న్యాయ బద్ధ సార్వబౌమాధికరం అనవచ్చు .అటువంటి శాసనాలను రాజ్యం ఆదేశాలుగా పరిగణిoచవచ్చు.ఇటు వంటి  సర్వబౌమత్వన్ని న్యాయసార్వబౌమాదికరం అనవచ్చు . ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యలో శాసన సబ్యులకు న్యాయ సార్వబౌమాదికరం ఉంటుంది.
b)   రాజకీయ సార్వబౌమాదికరం:-
రెండవ ప్రపంచ యుద్దం తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అవతంచాయి .ప్రజాస్వామ్య రాజ్యం లో రాజకీయ సార్వబౌమాదికరనికి ఎనలేని ఆదరణ లభించింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు గల పౌరుల సముదాయమే రాజకీయ సార్వబౌమాదికరం అని కొందరు అభిప్రాయ పడ్డారు .
c)     ప్రజా సార్వబౌమాదికరం:- ప్రముఖ రాజనీతి శాస్త్రజ్ఞులు రూసో ప్రజా
సార్వబౌమాదికరంనికి మూల పురుషుడు . జనేచ్చ సిద్ధాంత కర్త (theory of General will)  రూసో ప్రతిపాదించడు .
9 ) ఆస్టిన్ ఏకత్వ సిద్ధాంతాన్ని  వివరంచండి ?
ఆస్టిన్ సార్వబౌమాదికరం:-
       జాన్ ఆస్టిన్ ఆంగ్ల దేశ న్యాయవేత్త . ఇతడు క్రి .శ . 17 90 లో జన్మించాడు. న్యాయశాస్త్రం అభ్యాసం చేసి 18 18 లో న్యాయశాస్త్రవేత్తగా కొనసాగడు . ఇతడు 18 ౩౨ లో “ న్యాయశాస్తం మీద ఉపన్యాసం” ( lectures on jurisprudence) అనే గ్రంధంలో సార్వబౌమాదికరం మీద తన అభిప్రాయన్ని విశదీకరించారు.
సార్వబౌమాదికరం-నిర్వచనం :-
ఆస్టిన్ ప్రధమంగా నిర్వచించి తద్వారా  ,”సార్వభౌముడు ప్రజలకు ఇచ్చిన అజ్ఞాలే చట్టం అనే” అని నిర్వచించాడు .
ఆస్టిన్ సిద్దాంతం లోని మౌలిక అంశాలు:-
ఆస్టిన్ ప్రతిపాదించిన  ఏకత్వ సార్వబౌమాదికరం లో ఉన్న మౌలిక అంశాలు ఇవి :
i.       రాజ్యం ఒక నిర్ణీతమైన వ్యక్తి అతనిని సార్వభౌముడిగా గుర్తించ వచ్చు. అతనికి అపరిమితమైన , నిరపేక్షమైన అధికారాలు ఉంటాయి .
ii.     ప్రతి రాజ్యం లో ఒక సార్వబౌమాదికరి  ఏర్పడి దండ నాదికారంతో ప్రజలను  వ్యవస్థలను  ప్రభుత్వాన్ని శాసిస్తూ పరిపాలిస్తాడు .
iii.  సమాజంలో ఎక్కువ మంది అలవాటు ప్రకారం, చట్ట ప్రకారం సార్వభౌముడి విదేయులే ఉంటారు .
iv.  సార్వభౌముని అధికారం అవిభాజ్యమైనది. దీనిని విభజిస్తే దాని ఏకత్వo నశిస్తుంది .
v.     శాసనాలకు మూలాధారం సర్వబౌముడు, అతని ఆజ్ఞ చట్టం . చట్టాన్ని ఉల్లంఘo చిన వారు శిక్షార్హలు కాగలరని ఆస్టిన్ పెర్కొనాడు.
విమర్శ:-
 ఆధునిక శాస్త్రజ్ఞులైన హరాల్డ్. జాన్ లస్కి , హెన్రీ మైనె , సిడ్నీ వెబ్బ్  వంటి రాజనీతి శాస్త్రజ్ఞులు, ఆస్టిన్ సార్వబౌమాదికర సిద్ధాంతాన్ని విమర్శించారు .
1.     నియంతృత్వ రాజ్యాల్లో ఆస్టిన్ అభిప్రాయపద్డినట్లుగా  నిర్ణీతమైన సర్వబౌముని గుర్తించడం  చాలా కష్ట మని హెన్రీ మెయిన్ , సిడ్ విక్ , క్లార్క్ వంటి ప్రముఖులు తిరస్కరించారు .
2.    ఆస్టిన్ చెప్పిన నిరపేక్ష సార్వబౌముత్వం ఆచరణ యోగ్యం కాదని ప్రాముఖ్య శాస్త్రజ్ఞులు బ్లుంట్ సిలి వ్యాఖ్యానించారు .
3.    ఆస్టిన్ సర్వబౌముత్వం అవిభాజ్యమని వాదించాడు .
10) బహుత వాద సిద్దాంతాలను వివరించాo డి ? 
జ) రాజనీతి శాస్త్రంలో బహుతా వాదం యిటివల కాలం లో ప్రచారం లో కి వచ్చింది.
          ప్రజాస్వామ్య దేశం లో సర్వబౌముత్వం బహుతవాద సిద్దాంతం బాగా గుర్తింపు పొందింది . మధ్య యుగంలోని వృత్తి సంఘాల ఏర్పాటుతో బహుతా వాదo అవతరించిందని కొందరు అభిప్రాయ పడ్డారు .సర్వబౌముత్వ బహుతవాదాన్ని ప్రతిపాదించిన వారిలో బర్కేర్ ,జ్ . డి .హచ్ . కోల్ , లస్కి ,మైటే ల్యాండ్ ,మికైవార్  ప్రముఖులు.
          బహుతా వాదులు రాజ్యాధికారాని తిరస్కరించ లేదు . రాజ్యం ఒక ప్రధాన రాజకీయ సంస్థ అని దానికి నిరప్పెక్షా ధికారo లేదని వారు బావించారు . సార్వబౌమాదికరం ఒక నిర్ణీత వ్యక్తి లో ఉంటుందన్న వాదన సరైoది కాదని బహుతా వాదులు అభిప్రాయపడ్డారు . సర్వబౌముడుని ఆజ్ఞ లే చట్టాలని వాదానను వారు తిరస్కరించారు .
బహుతా వాద సిద్దాంత o – విమర్శ:-
  సార్వబౌముత్వ బహుత్వా  వాద సిద్దాంతం యిటి వల్ల కాలంలో అనేక విమర్శ లకు గురైoది. బహుతా వాద సిద్దాంత o లో అంతర్గత  వైరుధ్యం  ఉన్నాయని విమర్శకులు బావించారు .
రాజ్యం లోని వివిధ సంఘాలను క్రమ బద్ద చేసే అధికారాన్ని రాజ్యానికి అప్పగించడానికి హ్. జె .లస్కి , బర్కేర్ లాంటి పండితులు అంగీకరించారు.
    బహుతావాదులు  సమాజంలోని వివిధ సంస్థలన్ని సమాంతర రేఖలో ఉంటాయని భావించారు .ఆధునిక రాజ్య మంటే సంక్షేమ  రాజ్యం ( modern state is a welfare state ) అనే కొత్త వాదన ఏర్పడింది రాజ్యానికి ఆధిక్యత బాగా పెరిగింది .11 )  దేవదాత్తకర సిద్దాంతాన్ని వివరించండి ?
జ) పరిచయం:-
        రాజ్య అవతరణ సిద్దాంతా ల్లో దైవదత్తధికార సిద్దాంతo చాలా ప్రాచీనమైoది .రాజ్యం గురించి ఆలోచన ఎంత ప్రాచీనమైనదో దేవదాత్తకర సిద్దాంత o కూడా అంతే పురాతనమైనది. ఈ సిద్దాంతం ప్రకారం  రాజ్యం భగవంతుని సృష్టి లో అవతరించింది.రాజు లేదా రాజ్య నిర్వాహకుడు భగవంతుని ప్రతినిధిగా బాధ్యతలను స్వీకరించి రాజ్యాన్ని పరిపాలించేవారు .
      ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం ఈ విషయం తెలుస్తుంది. మధ్య యుగంలో దైవదతాధికార సిద్దాంతం బాగా ప్రచారంలోకి వచ్చింది రాజు భగవంతుని ప్రతినిధుడని బావన ప్రజల్లో ఏర్పడింది . మత ప్రధాన రాజ్యాలు రూపొందాయి ఈ రాజ్యల్లో మాత్రమే కేంద్ర బిందువుగా ఉండేది .రాజ్యాధికార సిద్దాంతంలో ఈ సిద్దాంతం ప్రజలకు బాగా ఆకట్టుకుంది.
     క్రైస్తావ మతాచార్యుడు రాజనీతి శాస్త్రజ్ఞుడు  సెయింట్ థామస్ అక్వినాస్  దైవదతాదికార సిద్దాంతన్ని సమర్దించిన వారిలో ప్రముఖుడు మధ్య యుగానికి చెందిన క్రైస్తావ  మతాచార్యులు కూడా ఈ సిద్దాంతాన్ని బల పరిచారు .
రాజుల అధికార పతిష్టత కు సంభందించిన  అంశాలను ఈ క్రింది విధంగా పేర్కొన వచ్చు.
1)  రాజ్యాధికారం దైవదత్త మైంది .రాజుకు సమస్త అధికారాలు దైవం ద్వార  సంక్రమించాయి .
2) రాజరికం వంశాపరంపర్యాంగా  కొనసాగుతూ వస్తున్న పాలనా వ్యవస్థ ప్రభువులు రాజ్య పాలన హక్కు భగవంతుని నుంచే పొందారు .
3)  రాజ్య నిర్వహణలో ప్రభువులు ప్రజలకు కాకుండా భగవంతుని విదేయులే ఉంటారు. వారు భగవంతునికే భాద్యులవు తారు గని ప్రజలకు కారు .
4) న్యాయ బద్ధ మైన ప్రభువుల అధికారాన్ని , శాసనాలని ధిక్కరించడం మహా పాపం . రాజులూ లేదా ప్రభువుల  పాలనను వ్యేతిరేకిo చడం .
విమర్శ:-
ఆధునిక రాజ్య వ్యవస్థలో  దైవదతాదికార సిద్దాంతం అనేక విమర్శలకు గురి కావడo జరిగింది.
1) ఆధునిక పౌర సమాజంలో దైవదతాదికార సిద్దాంతం అమోగ్య మైనది కాదు .ఈ సిద్దాంతం మత విశ్వాసం, మూడ నమ్మకల  మీద ఆధారపడింది .కాబట్టి హేతుబద్ధమైన  సిద్దాంతం కానేకాదు.
2)  రాజ్యం భగవంతునిచే నిర్నించబడ్డింది కాదు , మనవ అవసరాలను  తీర్చుకోవడానికి ప్రజలే తమ సమస్యల పరిష్కారానికి రాజ్యాన్ని  నిర్మించుకున్నారు, రాజ్యం వేదికంగా అవతరించిందని ఆధునిక రాజనీతిశాస్త్రంలో ఎక్కడ  పేర్కొనలేదు .
3 ) రాజ్యం రాజకీయ వ్యవస్థ . ఒక నిర్దిష్టమైన  ప్రదేశానికి చెంది  ఆ ప్రాంతం  ప్రజల అవసరాలు తీర్చడానికి రాజ్యం అవతరించింది.
12 ) సామజిక ఒడంబడిక సిద్దంతంను  వివరించండి ?
జ) రాజ్య అవతరణ సిద్దాంతంలో అత్యంత ప్రజా వతరణ పొందినది సామజిక ఒడంబడిక సిద్దాంతం .ఈ సిద్దాంతం చారిత్రకo గా ప్రసిద్ధి చెందింది .ప్రాచీన భారత దేశం లో బౌద్ధమతస్థులు రాజ్యవతరణ కు ప్రజా ఒడంబడిక కారణమని భావించారు . తూర్పు దేశాలో ఎంతో మంది మేధావులు ఈ సిద్ధoతానన్ని బలపరిచారు. థామస్ హోబెస్ , జాన్ లాక్ , రూసో అనే ప్రముఖ రాజనీతి తత్వవేత్తలు  ఈ సిద్దాంతాన్ని ప్రతిపాదించారు .
a) హోబెస్ సిద్దాంత వివరణ:-
      ఇంగ్లాండ్ దేశానికి చెందిన థామస్ హబెస్ తన గ్రంధం అయిన “లేవియాధన్” లో సామజిక ఒడంబడిక సిద్దాంతాన్ని గురించి వివరించాడు.ఆనాటి ఇంగ్లాండ్ లో చెలరేగిన అంతర్యుద్ధం వల్ల ఏర్పడిన పరిణామాలను రాజ్య అవతరణ పట్ల హబ్స్  అభిప్రాయలను కేంద్రీక రించి క్లిష్ట పరిస్దితి  నుంచి దేశాని కాపాడి శాంతి భద్రతలను నెలకొల్పిడానికి సర్వాధికారాలు గల సార్వభౌముడు అవసరమని హాబ్స్ వాదించాడు .
ప్రాకృతిక వ్యవస్థ;-
      రాజ్య అవతరణకు పూర్వం మానవుడు జీవించిన స్థితిని హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థ అని పెర్కొనాడు.ఈ  సందర్భంలో హాబ్స్ మనవ స్వభావo  ఫై తన భావాలను తెలియ బర్చాడు .మానవుడు స్వతహాగా స్వార్ధపరుడు, క్రూరుడు, అవనితి పరుడు , ఎల్లప్పుడూ తన భద్రత గురించి తాపత్రయం పడుతూ ఉంటాడు . మానవుడు సంఘ వెతిరేక జంతువూ అని దురాలోచన గల ప్రాణి అని వర్ణించాడు. సమాజంలో అధికారం గౌరవం కొసం ఒకరితో ఒకరు పోటి పడి ప్రమాద కరమైన సంఘర్షణ లకు దారి తీసి ప్రాకృతిక వ్యవస్థలో దుస్థితి ఏర్పడుతుంది హాబ్స్ వివరించాడు.ప్రతి వ్యక్తీ మరో వ్యక్తితో ఒప్పందం చేసుకొని అధికారాలను దత్తం చేస్తారు . తత్ఫలితంగా రాజ్యం అవతరించి సార్వబౌముడు సర్వాధికార అధికారాన్ని చెలాయిస్తారు .
ఒడంబడిక:-
      థామస్ హాబ్స్ అభిప్రాయo లో ఒడంబడిక ప్రజలకు మధ్య జరుగుతుంది . సర్వబౌముడు దీనికి బాధ్యుడు  కాడు .అతడు ఒప్పందం లో భాగస్వామ్యడు  కాడు  (sovereign exist by virtue of the pact and not prior to it) హాబ్స్  రాజ్యానికి , ప్రబుత్వానికి మధ్య  ఎలాంటి  వ్యత్యాసాన్ని చూపలేదు . అతని ఉద్దేశ్యంలో ఒడంబడిక ద్వారానే రాజకీయ సమాజం ఏర్పడుతూoది .
విమర్శ:- హాబ్స్ వర్ణించిన ప్రాకృతిక వ్యవస్థలో సహజ జీవితం  సమర్ధవంత మైన రాజకీయ జీవనం గని ప్రతిబింబo చలేదు . స్వార్థ పరు లేన , దుష్టు లై న మానవులు అనుకోకుండా ఒడంబడిక ద్వారా రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన రావటం ఆశ్చర్యకరమైన విషయం .
హాబ్స్  అభిప్రాయo మానవులందరూ ఒడంబడిక ద్వారా తమ హక్కులను పోగొట్టుకుo టారు. హాబ్స్ నాగరిక  సమాజంలో ప్రజలకు గల ప్రధామిక  హక్కుల ప్రాధాన్యత ను గుర్తించలేదు .
B) జాన్ లాక్  సామజిక ఒడంబడిక సిద్దాంతం :-
     17 వ శతాబ్దానికి చెందిన జాన్ లాక్ ప్రముఖ ఆంగ్ల  జాతీయ తత్వ. ఇతడు ఉదార ప్రజాస్వామ్యన్ని బల పరిచారు. రాజనీతి తత్వికుల్లో లాక్ ప్రప్రధముడు , ప్రజాస్వామ్య పద్దతిని బల పరిచడానికి జాన్ లాక్ సామజిక ఒడంబడిక సిద్దాంతాన్ని ప్రతిపాదించాడు . తాను రచించిన “ పౌర ప్రభుత్వం “ అనే గ్రంధంలో తన భావాలను వ్యక్త పరిచాడు .
       మనవ స్వభావం ఫై లాక్ తన భావాలను తెలియ బర్చాడు. ఇవి హాబ్స్ భావాలకు భిన్నo గా ఉన్నాయి . లాక్ మానవుని స్వభావాన్ని వర్ణిస్తూ మనిషి సహజంగా మంచి వాడని , సంఘ జీవి అని , ప్రజలందరూ ప్రాకృతిక వ్యవస్థలో పరస్పర సహకరo తో జీవించే వారిని పేర్కొన్నాడు . లాక్ ప్రజాస్వామ్యవాది కాబట్టి ప్రభుత్వo  ప్రజల సమ్మతి ఫై ఏర్పడు తుందని అభిప్రాయ పడ్డాడు., ప్రజల హక్కులను కాపాడి , శాంతి భద్రతలను నెలకొల్పి భాద్యత ప్రభుత్వ నీదేనని లాక్ అభిప్రాయ పడ్డాడు.
C) రూసో సామజిక ఒడంబడిక సిద్దాంతం :-
       18 వ శతాబ్దానికి చెందిన జీన్ . జాక్విస్ రూసో సామజిక సిద్దాంతానికి నూతన ప్రక్రియ రూపొందించాడు . రూసో రచనలు, తాత్విక భావాలు తర్వాత  కాలంలో కీలక పరిణామాలు దారితీసాయి . సామజిక ఒడంబడిక వాదులో రూసో ప్రముఖుడు, హాబ్స్ , లాక్ ల వలే రూసో రచన లకు తక్షణ ప్రమాణం అంటూ ఏమి లేదు . “మానవుడు జన్మతః స్వేచ్ఛా జీవి”, కానీ సమాజ మనే సంకెళ్ళుతో భందితుడే ఉన్నాడని పేర్కొన్నాడు అనే భావాలను రూసో తన ‘ సోషల్ కాంట్రాక్ట్’ అనే గ్రంధం లో పేర్కొన్నాడు.
        రూసో అది మానవునదిని నోబుల్ సవేజ్ అని  వర్ణించాడు. మానవుడు నిరాడంబరo గా , ప్రశాంతంగా, ప్రాకృతిక వ్యవస్థ లో జీవించాడని  రూసో అభిప్రాయ పడ్డాడు. స్వేచ్ఛా, సమానత్వాలను సంపూర్ణo గా అనుభవిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని ప్రాచీన అనాగరిక జీవితాన్ని గడిపేవారని రూసో భావించాడు. జనాభా పెరుగు దల , వ్యక్తి గత ఆస్తి , స్వార్థం, కపటం, సమాజంలో పెరగడం వల్ల మానవుని పతనం ప్రారంభమైన .
 రూసో సిద్దాంతంలో జనేచ్చ;-
       రూసో ప్రతిప్రదించిన సామజిక ఒడంబడిక ద్వారా జనేచ్చకు ప్రాముఖ్యత ఏర్పడింది . రూసో సిద్దాంతం లో జనేచ్చ సార్వబౌమాధికారి , మనవ సమాజనికి  జనేచ్చ ప్రతినిధి . జనేచ్చ ద్వారా రూసో ప్రత్యక్ష ప్రజాస్వామ్యన్ని బలపరిచారు.రూసో ప్రతిపాదించిన నిరపేక్షమైన జనేచ్చ ఆదర్శవాద సిద్దాంతానికి దారి తీసింది .
సామజిక ఒడంబడిక విమర్శ:-
1.     ఈ సిద్దాంతం కేవలం ఉహజనిక మైనది. ఈ సిద్దాంతాలకు ఎటువంటి చారిత్రిక ఆధారాలు లేవు . మానవులు ప్రాకృతిక వ్యవస్థలో నివసించే ఒడంబడిక ద్వారా రాజ్యాన్ని నిర్మించుకున్నారని చెప్పిడానికి చరిత్రలో సాక్షా ధారాలు లేవు .
2.    ఒడంబడిక సిద్దాంతం న్యాయబద్ధ మైన నిరూపించడానికి రాజకీయ అనుమతి చాలా అవసరం
3.    ఒడంబడిక సమాజానికి ప్రాకృతిక వ్యవస్థ కాదు . అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో మాత్రమే సామజిక ఒడంబడిక సాధ్యమవుతుంది.
ముగింపు:- రాజ్య వతరo ఎలా జరిగిందో వివరించిన సిద్దంతా లన్నిo టి లోను పరిణామాత్మక సిద్దాంతం శాస్త్రీయమైనది.
13) చరిత్రక లేదా పరిణామాత్మక సిద్దాంతం వివరించండి  ?
జ)  చారిత్రక లేదా పరిణామ ఫలితంగా అభివృద్ధి చెందడం మూలంగా ఏర్పడిందని చెబుతుంది . ఈ సిద్దాంతానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి . ఇతర సాంఘిక సంస్థల వలే రాజ్యం వివిధ పరిస్దితులలో అనేక కారణాల వల్ల అభివృద్ధి చెందిందని  ‘ గెటిల్’ అనే రాజనీతిశాస్త్రజ్ఞుడు భావించాడు.
 ప్రముఖ శాస్త్రజ్ఞులైన బార్కర్, మేకేవార్ , గర్నేర్ , గెటిల్ పరిణామ సిద్దాంతాన్ని సమర్దించారు .చారిత్రిక  లేదా పరిణామాత్మక సిద్దాంతాన్ని భౌతిక పరిసరాలు , భౌగోళిక పరిస్థితి ప్రభావమే కాకుండా ఈ దిగువ పేర్కొన్న అంశాలు రాజ్యవతరణ కు దాని అభివృద్ధికి తోడ్పడ్డాయి.
1.    భందుత్వం
2.    మతం
3.    వ్యక్తిగత ఆస్తి
4.    యుద్దం
5.    రాజకీయ చైతన్యం.
1)  బంధుత్వం :-
   ప్రాచీన కాలంలో సాంఘిక వ్యవస్థ నిర్మాణo బంధుత్వం. రక్త సంభందo ఫై ఆధారపడి ఉండేది. ఆది మనవ సమూహాలు బంధుత్వం ద్వారా ఏర్పడ్డాయి . ప్రాచీన రాజ్యాలలో ప్రాదేశిక సంభందాల కంటే వ్యక్తి గత సంభందాలు ఎక్కువ ప్రాముఖ్యత ఉండేదని గెటిల్ అభిప్రాయ పడ్డాడు.
2)  మతం :-
      రాజ్యవతరణ లో మతం మరొక ప్రధానమైన అంశం . మతం రక్త సంభందానికి ప్రతిక దాని ఏకత్వనికి , పవిత్ర తకు , భాద్యతకు  మతం మూలం మని విల్సన్ అభిప్రాయ పడ్డాడు. కుటుంబo , వంశాలు , గోత్రాలు, తెగలుగా విస్తరించడం లో బంధుత్వం బందాలు బల మై నాయి .
3వ్యక్తి గత ఆస్తి :-
       ప్రాచీన మానవుల ఆర్థికకార్యక్రమాలు కూడా అనేక విధాలుగా రాజ్యవతరణకు తోడ్పడ్డాయి. ఆర్థిక విధానంలో వచ్చిన మార్పులు ,సాంఘిక సంస్థల అభివృద్ధిలో ఒక మైలురాయి వంటిది . ఈ నూతన ఆర్థిక వ్యవస్థ ఏర్పడి ప్రజలను నియంత్రణ చేయడం వల్ల ప్రజల సంక్షేమ పధకాలను చేపట్టిడానికి రాజకీయ నాయకత్వం ఆవశ్యకత ఏర్పదిండి . ఆర్థిక వ్యవస్థ వ్యక్తీ గత ఆస్తి ఫై ఆధారపడి ఉంటుంది.
4) యుద్ధం:-
    యుద్ధంకూడా ప్రాకృతిక వ్యవస్థలో రాజ్యవతరణ కు దోహదపదిండి  యుద్దం నుండి రాజు జన్మిస్తాడు అనే నినాదం నిజమైంది . యుద్ధ సమయంలో ఆత్మ రక్షణకు , గాని , దురాక్రమణ జరపడానికి గాని యుద్ధం సాధారణo గా తోడ్పడుతుంది.
5) రాజకీయ చైతన్యాo :- రాజ్యం లో శాంతి భద్రతల పరిరక్షణ జీవనోపాధి. దేశ రక్షణకు రాజకీయ చైతన్యానo అవసర మైనది. ప్రజలు విదేశీపాలనలో నిరాశానిస్పృహలను గురేనపుడు రాజకీయ చైతన్యానo ఏర్పడుతుంది. ఈ చైతన్యమే భవిష్యత్తులో రాజకీయ తిరుగుబాటుకు దారి తీసింది .
ముగింపు:- రాజకీయ చైతన్యానo మానవునికి సహజ మైనది. “మానవుడు స్వాభావికo గా రాజకీయ జీవి” అని అరిస్టాటిల్ నిర్వచించాడు . క్రమబద్దమైన శాంతియుత జీవనం గడపడానికి రాజకీయ వ్యవస్థ అవసర మని మానవుడు గ్రహించి రాజ్యవతరణకు తోడ్పడ్డాయి చెప్పవచ్చు.
14 )  శాసనo  అర్థాలు , నిర్వచనాలు తెల్పండి ?
1.    ఆచారాలు , వాడుకలు:-
 నాగరిక సమాజంలో ఆచారాలు , వాడుకలు న్యాయ సూత్రాలకు మూలాధారాలుఅని చెప్పవచ్చు . జన సమ్మత మైన ప్రవర్తన నియమాలనే ఆచారం అంటారు . ఆచారాలు , వాడుకలు శాసన మూలాధారాలతో అత్యంత ప్రాచీనమైనది. రాజ్య జీవనాన్ని క్రమబద్దం చేసేవే ఆచారాలు , సామజిక ద్యేయం లో ప్రాచీన కాలంలో రాజ్య శాసనాలు లేవు సామజిక ఆచారాలు , సంప్రదాయలు ఏ విధంగా ఆచరణలోకి వచ్చా యో స్పష్టంగా తెలియదు.
2.    మతం , ఆచారాలు :-
శాసనాల రూపకల్పనలో మతం కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది .ప్రాచీన కాలంలో ఆచార o , సంప్రదాయలకు , మతానికి మధ్య వత్యాసం ఉండేది కాదు . మధ్య యుగం యూరోప్ లో క్రిస్తవ మతాచార్యుల సలహాలను , ఆజ్ఞలను శాసనాలుగా భావించి రాజ్యన్ని పరిపాలించే వాడు . ఆధునిక శాసనాల అమలుకు ఈ మతమే మూలాధారంమని ప్రాచీనులు భావించారు .
3.    న్యాయస్థానాల తీర్పులు :-
 న్యాయ స్థానాలు ఇచ్చె తీర్పులు శాసన మూలాధారాలో అత్యంత ప్రధానమైనవి . స్పష్ట మైన అర్థం  వివరణల ద్వారా వివాదాలను పరిష్కారించడం న్యాయ స్థానాల ప్రధాన కర్తవ్యం. న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులె శాసనాలుగా అమలు లోకి వస్తాయని  ఆమెరికా  సుప్రీంకోర్టు న్యాయమూర్తి “జస్టిస్ హాబ్స్ “ అభిప్రాయపడ్డాడు.
4.    శాస్త్రీయ వ్యాఖ్యానాలు:-
విలువైన న్యాయ సూత్రాలు చోటుచేసుకున్నయి , న్యాయశాస్త్ర వేత్తలు చేసిన వ్యాఖ్యానాలే న్యాయసూత్రాలు , ఆచారాలను న్యాయమూర్తుల నిర్ణయాలను , చట్టాలను సేకరించి వాటిని క్రమబద్దంగా న్యాయశాస్త్ర వేత్తలు  ఏర్పాటు చేస్తారు .
5.    శాసన  సభ :-
ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాల్లో శాసన సభ లు రూపొందించే చట్టాలు శాసనానికి మూలాధారం. ప్రజాస్వామ్య దేశాల్లో  ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజాప్రతినిధులు ప్రజల  అభిప్రాయలను సారం శాసనా లను రూపొందిస్తారు . శాసన సభలు రూపొందించిన చట్టలు కార్యనిర్వాహక వర్గం ద్వారా ఆచరణలో కి వాస్తాయి .
6.    సమత (సహజ న్యాయo ):-
  సమత అన్నది సహజ న్యాయo రాజకీయ న్యాయవ్యవస్థలో సమతను న్యాయమని పేర్కొనారు .న్యాయశాస్తంలో న్యాయసూత్రాలను సమత అంటారు .న్యాయమూర్తుల తీర్పుల ఫలితంగా రూపొందించిన సహజ న్యాయమే సమత .
15)   శాసనo – నీటికి మధ్య గల సంభందం ?
)   శాసనo –నీతి ( law  and morality):-
         నాగరిక సమాజంలో మానవుని  బాహ్య చర్యలను క్రమబద్దం చేయడానికి మాత్రమే న్యాయ సూత్రాలలను రూపొందించడం జరిగింది. ఈ న్యాయసూత్రాలకు అంతరంగిక ప్రవర్తనలో ఎలాంటి సంభందం ఉండదు.ఇలాంటి సందర్భంలో నీతి సూత్రాల ప్రభావo మానవుని మానసిక ప్రవృతి ని క్రమబద్దం చేస్తుంది .నీతి సూత్రాలు ఆదర్శ ప్రాయమని ప్రముఖ రాజనీతి పండితులు ‘సిడ్ విక్’ పెర్కొనాడు. నాగరిక సమాజంలో న్యాయసూత్రాలకు నీతి సూత్రాలకు మధ్య అవినాభావ సంభందం ఏర్పడిందనీ పండితులు భావించారు .
         శాసనాలను రాజ్యం రూపొందించి అమలు పరుస్తుంది .వాటిని అతిక్రమించిన వారిని శిక్షిస్తుంది , నీతి సూత్రాలను అతిక్రమిo చిన వారిని సంఘం నికి శిక్షిo చే అధికంలేదు. నీతి సూత్రాల అమలు విషయంలో రాజ్యం ఏ మాత్రం జోక్యం చేసుకోదు. న్యాయ సూత్రాలకు నిర్దిష్టమైనరూపం ఉంది . నీతి సూత్రాలను నిర్ణయించడానికి గాని , సంస్థలు లేవు . నేతిక ప్రమాణాలు  వ్యక్తిని , మతాన్ని , సంఘాన్ని పరిస్థితులాని అనుసరిo చి  మారుతుంటాయి.శాసనo వ్యక్తి బాహ్య ప్రవర్తనకు సంభందించింది . దాని పరిధి నీతి సూత్రాల కన్నా పరిమితమై ఉంటాయి  శాసనo అవినీతిపరం మైన చర్యలను , ప్రవర్తనలను నిషేధి స్తుంది . రాజ్యానికి గల దండనాధికారo  శాసనలను అమలు పరచడమే కాకుండాశాంతి భద్రతలను పరిరక్షిస్తుంది . నీతి సూత్రాలు  వ్యక్తి గత మైన సమాజ ఒత్తిడి వల్ల ఆచరణలోకి వస్తున్నాయి . నీతి సహజo గా మానవుని అంతరాత్మ సంభంద విషయాల్లో వత్తిడి పనికిరాదని బార్కర్ భావించాడు.
16 ) స్వేచ్ఛా- సమానత్వం మధ్య గల సంభందం తెల్పండి ?
జ)  పౌర సమాజం లో మానవుడు స్వేచ్ఛా, స్వతంత్ర్యం, సమానత్వం కొసం మనవ హక్కుల కొసం ఏంటో కాలంగా పోరాటం కొనసాగిస్తూనే ఉన్నాడు . స్వేచ్చ , సమానత్వం సాధనలో ఎందరో మహానుభావులు ప్రాణాలను త్యాగo చేసి నట్లు ప్రపంచ చరిత్ర ద్వారా తెలుస్తుంది. రాజనీతి శాస్త్రంలో స్వేచ్చ అనే భావన ప్రధాన అంశం గా ఆచరణలోకి వచ్చింది . వ్యక్తి పూర్తిగా స్పూర్తి పొందడానికి అవకాశం గల వాతావరణమే స్వేచ్చ అని లస్కి నిర్వచించాడు.
స్వేచ్ఛావదుల భావాలు :-
1)  ప్రభుత్వం ఎంత పరిమితంగా వ్యవహరిస్తే వ్యక్తికి అంత స్వేచ్చ లభిస్తుందని స్వేచావాదులు  వాదించారు . జె .ఎస్ .మిల్ , స్పెన్సర్  లాంటి ప్రముఖులు రాజ్యధికారo కన్నా వ్యక్తి స్వేచ్చకు అధిక  ప్రాముఖ్యత నిచ్చారు . స్వేచావాదులు అభిప్రాయo లో ప్రతి వ్యక్తికి తన మంచి చెడు తెలుసు .వారి ఉదేశంలో ప్రతి వ్యక్తికి తన మంచి చెడు తెలుసు కొని తన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొవాడని స్వేచ్ఛ బాగా తోడ్పడుతుంది.
2) 18 ,19 వ శతాబ్దాల్లో స్వేచ్ఛా ఆధారo గా రాజకీయ ప్రజాస్వామ్యం ఏర్పడింది  పరిశ్రమలు , వాణిజ్యo , ఆర్థిక రంగం, వర్తక రంగాలో  ఒప్పందాలు  చేసుకోవడానికి వ్యక్తులకు , మధ్య సంపూర్ణ స్వేచ్ఛా అవసరం మని స్వేచ్ఛావాదులు వాదించారు . అందువల్ల రాజ్యం ఒక అవసరమైన క్లే శం” (state is అ necessary) అని భావించాడు.
3) వ్యక్తి స్వేచ్ఛాను సమర్దించిన ఆధునిక రాజనీతితత్వవేత్తల్లో  జె .ఎస్ .మిల్ అగ్రగణ్యుడు మిల్ రచించిన గ్రంధం “ఆన్ లిబర్టీ” (on liberty) వ్యక్తి స్వేచ్ఛా కు సంభందించిన అనేక వివారాలు లభిస్తాయి .
4) స్వేచావాదులు వ్యక్తి స్వేచ్ఛాను ప్రతిపాదించగా రాజ్య పరిధిలోనే ప్రభుత్వ చట్టాలకు పూర్తి విదేయులే చూపడం ద్వారానే వ్యక్తికి స్వేచ్చ లభిస్తుంది అనే భావాన్ని అధికార వాదులు పేర్కొన్నాడు. వ్యక్తి తన స్వేచ్చ ను భాద్యతలను గుర్తించి తన విధులను నిర్వహించడం ద్వారానే స్వేచ్ఛాను సంపాదించు కుంటాడు .
17 ) స్వేచ్ఛా యొక్క వివిధరకాలు తెలపండి?
జ ) వ్యక్తి త్వ వికాసానికి, ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదలకు వివిధ రకాల స్వేచ్చ అవసరం . విభిన్న దృక్పథల గురించి స్వేచ్చను ఐదు రకాలుగా విశాదికారి చడం జరిగింది.
1.    సహజ స్వేచ్ఛ
2.    పౌర స్వేచ్ఛ
3.    రాజకీయ స్వేచ్ఛ
4.    ఆర్ధిక స్వేచ్ఛ
5.    జాతీయ స్వేచ్ఛ
1) సహజ స్వేచ్ఛ:- 
     గ్రీక్ , రోమన్  తత్వవేత్తలు , మధ్య యుగానికి చెందిన సంప్రదాయక తత్వవేత్తలు , మతాచార్యులు , సహజ స్వేచ్ఛను గుర్తించారు . ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతి వ్యక్తి తన ఇష్టాను సారంగా వ్యవహరిo చే స్వతంత్రాన్ని సహజ స్వేచ్ఛ అంటారు . వ్యవస్థే కరమైన సుప్రసిద్ధమైన మానవ సహజ జీవితంలో అపరిమితమైన స్వేచ్ఛకు అవకాశం లేదు .
2) పౌర స్వేచ్ఛ:-
     మానవుడు సంఘ జీవి , మానవుడు సంఘంలో అనుభవించే స్వేచ్ఛను గుర్తించారు. పౌర స్వేచ్ఛ సమాజంలో ప్రజల మధ్య సంభందాలను క్రమబద్దం చేస్తుంది .సహజమే పౌర స్వేచ్ఛ ద్వారా వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది. సంఘo లో గల వ్యక్తి గత స్వతంత్రo గా జీవించి నపుడే స్వేచ్ఛకు గుర్తింపు లబిస్తుంది .
      రాజ్యం గుర్తించి అమలు పరిచే హక్కులే పౌర స్వేచ్ఛ అని గెటిల్ భావించాడు. రాజ్యం ప్రజలకి చ్చిన పౌర స్వేచ్ఛ ను అనుభవించడానికి ప్రభుత్వం నుంచి లేదా ఇతర సంస్థల నుంచి ప్రతి పౌరునికి కొన్ని సదుపాయాలు కల్పిస్తుo ది .
1.    ఆత్మ రక్షణ హక్కు
2.    పని చేసే హక్కు
3.    ఆస్తి హక్కు
4.    మత హక్కు
3) రాజకీయ స్వేచ్ఛ:-
      దేశంలో నివసించే పౌరులo దరూ రాజ్య కార్యకలాపాల్లో పాల్గొనటానికి ఉన్న స్వేచ్ఛయే  రాజకీయ స్వేచ్ఛ అని అంటారు . రాజకీయ స్వేచ్ఛను పౌర స్వేచ్ఛను ప్రజలు రాజ్య కార్యక్రమాల్లో పాలుపంచు కోవడానికి ఉపయోగిo చుకొంటారు. పౌర స్వేచ్ఛ లేనిదే రాజకీయ స్వేచ్ఛ ఏర్పడదు .రాజకీయ స్వేచ్ఛను ఈ క్రింది ప్రాధమిక హక్కులు అంతర్భాగాలు .
a.     ఓటు హక్కు
b.    ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం
c.     పదవులు చేపట్ట టం
d.    ప్రభుత్వ ని విమర్శించటం .
4 ) ఆర్థక  స్వేచ్ఛ:-
      నాగరిక సమాజంలో జీవించే ప్రతి పౌరుడు ఉపాది ద్వారా ప్రగతిని సాధించడానికి ఆర్థికపరమైన అవకాశాలు ఎంతైనా అవసరo . ఆర్థక ప్రగతికి సంభందించిన ప్రక్రియ లను ఆర్థిక స్వేచ్ఛ అంటే వ్యక్తి తన దైనండిన ఆహారాన్ని  సమకూర్చుకోవడానికి లభించే అవకాశం .
5) జాతీయ  స్వేచ్ఛ :-
      జాతీయ స్వేచ్ఛ అనగా ఎలాంటి జాతికి గాని , బాహ్య అధికారానికి  గాని , లోబడి   స్వతంత్ర ను పొంది ఉండటం అని అర్థం . వాస్తవo గా చెపాలంటే జాతి అనుభవించే స్వతంత్రాన్ని జాతీయ స్వేఛ్చ గా పేర్కొనవచ్చు .
18 ) స్వేఛ్చ   యొక్క పరిరరక్షకాలను తెల్పండి ?
జ)  రాజ్యాంగ బద్ధ మైన ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మాత్రమే స్వేఛ్చ స్వాతంత్రాలు వర్ధిల్లు తాయి . ప్రజలు ఆలోచనా బద్దులై  స్వేఛ్చను బాధ్యతాయుతo గా  ఉపయోగిo చుకొని , దాన్ని పరిరక్షించు కుంటారు .
1) ప్రభుత్వానికి ప్రజలకు మధ్య పరస్పర సహకరo ఉన్నప్పుడే స్వేఛ్చకు రక్షణ లభిస్తుంది . అటువంటి అనుకూల వాతావరణాన్ని సృష్టిo చడానికి ప్రజలకు గల హక్కులను  నిర్వచించి , వాటిని రాజ్యాంగ చాట్టల ద్వారా ప్రాధమిక హక్కుల జాబితాలో పొందు పరచడం ఎంతైనా అవసరం .
2) ప్రజాస్వామ్యంలో బల ప్రదర్శనలో , శాసన సభ , కార్యనిర్వాహక వర్గాలు పౌర హక్కులను నిరోధించే అవకాశం ఉన్నాయి . రాజకీయ , సాంఘిక, ఆర్థిక అవసరాల మేరకు సాంఘిక న్యాయన్ని సాధించాలనే లక్ష్యం తో మెజారిటీ నిర్ణయాన్ని అమలు పరచడం, ప్రజాస్వామ్య వ్యవస్థ లో పరిపాటి .
3 )  చిత్త శుద్ధి గల ప్రభుత్వ  విధనాలు , స్వేచ్ఛా పరిరక్షణ ఎక్కువగా దోహదo చేస్తాయి . ప్రభుత్వ యంత్రాంగం కొందరికి మాత్ర మే  లాభ దాయకం గాను , మరికొందరు నష్ట దాయకం గాను ఉండ కూడదు .ప్రభుత్వ విదానాల రూపకల్పన వాటి ఆచరణలో నిష్పాక్ష పాత వైఖరి ఉన్నప్పుడే స్వేచ్చను పరిరక్షించడo జరుగుతుంది.
4) స్వేఛ్చాను పరిరక్షించం లో సమ న్యాయ పాలన ఎవరి పట్ల విచక్షణ చూప కుండ చట్టం ద్వారా అందరికి సమాన రక్షణను కలగ జేసుంది . కులం , మతం , భాష , ప్రాంతం , మొదలైన వాటిలో సంభందాo చట్టం దృష్టిలో ప్రజలందరూ సమానులే అన్న భావం ఏర్పడుతుంది.
5) నియంతృత్వ విధనాలను నిరోధించడానికి, ప్రభుత్వ విధనాలను అరికట్టడానికి ,ప్రభుత్వంగాలు లను మూడు గా విభజించరు .
6) సామాన్య ప్రజల చేతుల్లో అధికారాన్ని దత్తత చేసే ప్రజాస్వామ్య వ్యవస్థ. స్వేచ్చ పరిరక్షణకు గట్టి పునాదులు వేస్తుంది .
7) స్వేచ్చ పరిరక్షణకు స్వతంత్ర వార్త పత్రికలు తడ్పడుతాయి . ఒక సున్నితమైన మార్గ o లో శక్తి వంత మైన మార్గంలో శక్తి వంత మై . ప్రజా భిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో పత్రికలు సాధనాలుగా ఉపకరిస్తాయి . పత్రికలు ప్రభుత్వ విధానాలను క్షుణ్ణంగా పరిశీలించి o ది .
8) సమాజంలో వ్యవస్థాపర మైన ఎన్నో పరిరక్షణలు స్వేఛ్చా కొసం సృష్టిo చుకోవడం జరిగింది. స్వేఛ్చా పరిరక్షణకు ప్రజలు అనుక్షణం జాగ్రత్త వహించాలి లస్కి అభిప్రాయo లో  స్వేఛ్చాకు ఆస లైన పరిరక్షణ దాని పట్ల ప్రజల కన్న గౌరవ భావమే .
19 )  సమానత్వం రకాలు తెలపండి ?
జ ) ప్రజాస్వామ్య రాజ్యాల్లో ప్రముఖoగా భావించే మనవ అభ్యున్నతికి సంభందించిన  విలువలో సమానత్వం అత్యంతప్రధానమైoది . ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రభుత్వాలకు ప్రధామిక సూత్ర మే సమానత్వం.
1) రాజకీయ సమానత్వం :-
       రాజకీయ సమానత్వం ప్రధాన లక్ష్యo పౌరులoదరికి సమనమైన రాజకీయ హక్కు లు ఉండాలన్నదే  రాజకీయ సమానత్వం అనగా పౌరు లందరూ ప్రభుత్వ  నిర్వహణలో పాల్గొనే అవకాశం పౌరులందరూ ప్రభుత్వ వ్యవహారాల్లో భాగస్వాములే ఉండాలి  అలా జరిగి నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ నిలుస్తుంది.
2 ) పౌర సమానత్వం :-
      పౌర స్వేఛ్చా, పౌరు లందరూ ఒకే విధ మైన పౌర హక్కు లు స్వేఛ్చా లను అనుభవించడంలోనే ఇమిడి ఉంది . చట్టం దృష్టిలో అందరూ సమానులే అనే సూత్రన్ని పాటించే తప్పుడే పౌర సమానత్వం సాధించడం జరుగుతుంది వర్గ విబేధాలు, మత విశ్వాసాలు హోదాని బట్టి పౌర సమానత్వాన్ని రూపొందించ కూడదు .
3)  సహజ సమానత్వం :-
      సాంఘిక వ్యవస్థలో సహజ సమానత్వం లేదు అనే విషయం ప్రస్తుత  సమాజంలోని అసమానతలు కొట్టివచినట్లు గా అర్థ అవుతుంది . జి .డి .హచ్. కోల్ అభిప్రాయo లో “ మానవు లంత బలం , శారీరక శక్తి , మానసిక సమర్ధయం , అభిలాష, తాత్విక దృక్పథంలో అనేక తేడాలలో ఉంటాయని వ్యాఖ్యానిo చాడు.
4) సాంఘిక సమానత్వం :-
     సామజిక వివక్షతను సాంఘిక దురాచారాలను రూపు మపడమే సాంఘిక సమానత్వం ముఖ్య లక్షణం . సాంఘిక సమానత్వం మంటే పౌరు లందరికి సంఘంలో రాజ్యం లో సమాన స్థాయి ఉండాలి . తమ వ్యక్తిత్వ న్ని పెంపొందించుకోవటానికి అందరికి సమన అవకాశాలు లబించాలి . వ్యక్తి పురోభివృద్ధి ని సాధించడానికి రాజ్యంలో అనుకూల మైన పరిస్దితులను ప్రభుత్వం కల్పించాలి .
5)  ఆర్థిక సమానత్వం :-
      రాజ్య వ్యవస్థ లో వర్గ రహిత సమాజాన్ని రూపొందించడానికి ఆర్థిక సమానత్వం చాలా కీలకమైoది లార్డ్ బైన్ భావించినట్లు ఆర్థిక సమానత్వంమద్దతు లేనప్పుడు రాజకీయ సమానత్వనికి ఎలాంటి గుర్తింపు ఉండదు. ప్రజాస్వామ్యవాది అయిన లస్కి , బైన్ అభిప్రాయాన్ని సమర్దిస్తూ  ఆర్థిక అధికారానికి రాజకీయ అధికారం సహాయ కారి మాత్రమే అన్నాడు .
20)  స్వేఛ్చా సమానత్వాలు గురించి  తెల్పండి?
జ )  స్వేఛ్చా సమానత్వాలు గురించి తమ అభిప్రాయలు వ్యక్తం చేసిన తత్వవేత్తలను స్థూలంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు . ఒక వర్గాo  అభిప్రాయo లో స్వేఛ్చా సమానత్వాలు పరస్పర పోషకాలు మరో వర్గ అభిప్రాయo లో స్వేఛ్చా సమానత్వాలు పరస్పర విరుద్దాలు.
 స్వేఛ్చా సమానత్వాలు పరస్పర విరుద్దాలు:-
     ప్రముఖ శాస్త్రజ్ఞులు “ స్వేఛ్చా సమానత్వాలు పరస్పర విరుద్దాలన్న వర్గానికి చెందిన వాడు . వీరు స్వేఛ్చా వాదులే కానీ సమానత్వ వాదులు కారు.లార్డ్ ఆస్టిన్ స్వేఛ్చాను బల పరుస్తూ సమానత్వ పిపాస స్వేఛ్చాను వమ్ము చేస్తుందని ప్రకటించారు. సమానత్వ కాంక్ష స్వేఛ్చా పట్ల ఆసక్తి ని నిరుపయోగం చేస్తుంది. రాజ్య పాలకులు , వ్యక్తులు గాని , సమానత్వానికి గాని అధిక ప్రాముఖ్యతను ఇచ్చినట్లు యితే స్వేఛ్చా మరుగునపడే అవకాశం ఉంది . లార్డ్ ఆస్టిన్ అభిప్రాయo లో ప్రతి వ్యక్తి అదుపు ఆజ్ఞ లేని స్వేచ్ఛను నిరాటంకంగా అనుభవిస్తు.అధికారాన్ని హస్త గతం చేసుకోవడానికి ధన కాంక్షను తీర్చుకోవడానికి సమానత్వం నమ రూపాలు లేకుండా పతనం అవుతుంది .అపరిమితమైన స్వేఛ్చా వల్ల సమానత్వానికి మాత్రమే కాకుండా పీడిత వర్గ ప్రజల స్వేఛ్చాకు విఘాతం కలుగుతుంది. దిని వల్ల సమానత్వానికి మధ్య అగాధం ఏర్పడుతుంది .
         స్వేఛ్చా సమంత్వాలు విరుద్దాలన్న వాదన వాస్తవిక దృక్పదంలో చుస్తే అవి పరస్పర విరుద్దాలు కావు . స్వేఛ్చా పరస్పర సాధనాలుగా వ్యక్తి వికాసానికి  తడ్పడుతాయి. స్పెన్సర్ అభిప్రాయo లో స్వేఛ్చా సమానత్వాలు వెతిరకాలు  కావు . వ్యక్తి వికాసానికి ఇవి రెండు స్వాయం పోషకాలు .స్వేఛ్చా సమానత్వాల మధ్య సమతౌల్యన్ని సాధించడం వల్ల స్వేఛ్చా విస్తరించినట్లే స్వేఛ్చా వల్ల సమానత్వం అభివృద్ధి చెందుతుంది .
21 ) ప్రత్యక్ష ప్రజా స్వామ్య లక్షణాలు, పద్దతులు పేర్కొనండి ?
జ ) ప్రత్యక్ష ప్రజా స్వామ్యం :-
     ప్రభూత్వ కార్యకలాపాలల్లో ప్రజలు ప్రత్యక్షo గా పాల్గొనే పద్దతి ని ప్రత్యక్ష ప్రజా స్వామ్యం అంటారు . ప్రభుత్వ విషయాలఫై ప్రజలే నేరుగా తమ అభిప్రాయలను వ్యక్తం చేసే ప్రభుత్వ వ్యవస్థ నే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటారు . అత్యంత ప్రాచీన గ్రీక్ , రోము నగర రాజ్యాల్లో ప్రత్యక్ష ప్రజాస్వామ్యo పద్దతి ఆచరణ ల్లో ఉండేది . కొన్ని పద్దతులను రూపొందించడం జరిగింది .
అవి ;
1.    ప్రజా భిప్రాయ సేకరణ
2.    ప్రజాభిప్రాయ నివేదన
3.    పునరాయణం
4.    ప్రజాభిప్రాయ నిర్ణయం
1 ) ప్రజా భిప్రాయ  సేకరణ:-
     ఈ పద్దతి ద్వారా రాజ్యనికి , ప్రజలకు సంభందించిన ముఖ్య విషయాల ఫై ప్రజాభిప్రాయన్ని సేకరించడం జరిగింది . రెఫరెండం  అనగా ప్రజలకు నివేది o చడం అనే అర్థం .స్విట్జర్లాండ్ ల్లో అమల్లో ఉన్న తీరును బట్టి ఇది రెండు రకాలు .
a) ఐచ్చిక ప్రజా భిప్రాయ సేకరణ:-
     స్విట్జర్లాండ్లో ఫెడరల్ శాసనాలన్నిoటిలోను ప్రజా భిప్రాయ సేకరణ జరగాలని నిర్భoదo లేదు . కొన్ని ముసాయిదా బిల్లులను ప్రజా భిప్రాయ సేకరణ నిమిత్తం పంపవచ్చు. కొన్నoటిని పంపకపోవచ్చు . ముఖ్యo గా ౩౦ వేల మంది  స్విస్ పౌరులు గానీ , లేదా 8 క్యాంటన్లు కానీ ఏ శాసనన్ని ప్రజా భిప్రాయ సేకరణకు పంపవలసిన కోరినట్లుతే , దాన్ని గురించి ప్రజా భిప్రాయ  సేకరణ జరపవచ్చ.
b) నిర్భంధ ప్రజాభిప్రాయ  సేకరణ :-
   స్విట్జర్లాండ్ లో అన్ని రాజ్యాంగ సవరణలను నిర్భంధింగా ప్రజాభిప్రాయ సేకరణకు పంపవలసి వస్తుంది .అధిక సంఖ్యాక ప్రజలు అమోదిసే అవి చెలామణీ అవుతాయి .
ప్రజా భిప్రాయ నివేదన :-
      ప్రజలు స్వయంగా తమ అభిప్రాయన్ని ప్రభుత్వ దృష్టికి తెచ్చే విధానమే ప్రజా భిప్రాయ నివేదన. ఈ పద్దతి లో ప్రభుత్వ శాసనాలను ప్రజా భిప్రాయ నివేదనం రెండు రకాలుగా ఉంటాయి .ఒకటి బిల్లు రూపంలో ప్రజాభిప్రాయ నివేదన, రెండు బిల్లు రూపంలో లేని ప్రజాభిప్రాయ నివేదన.
దోషాలు :-
పునరాయణం:-
      కార్యనిర్వాహక వర్గ సభ్యులు గాని , లేదా శాసన సభ్యులు గానీ తమ విద్యుక్తధర్మాన్ని నిర్వహణలో గాని అసమర్ధలని నిరూపణ కు వచ్చినట్లుతే ప్రజలు ఒక నిర్ణేత సంఖ్య లో తీర్మానించి అటువంటి వారిని పునరాయణం చేస్తారు అంటే అసమర్ధలు  లేదా నిష్ప్రయోజకులాని భావించిన ప్రతినిధులను పదవి నుంచి తొలగించి వస్తారు .
లోపాలు :-
ప్రజా నిర్ణయ సేకరణ:-
      ప్రొఫెసర్ సి.ఫ్.స్ట్రాంగ్ మాటలో ఇవి అక్షరాల ప్రజల తీర్పు రాజకీయ ప్రాధాన్యత గల సమస్యల ఫై ఓటు ద్వారా ప్రజా నిర్ణయాన్ని సేకరించడం ఈ పద్దతి లలోని విశేషం ముఖ్య o గా ఈ పద్దతి ద్వారా శాశ్వతమైన  రాజకీయ పరిష్కారం సాధించడం ప్రయత్నం జరుగుతుంది.
22) పరోక్ష ప్రజా స్వామ్యo యొక్క లక్షణాలు ?
) పరోక్ష ప్రజా స్వామ్యం :-
   పరోక్ష ప్రజాస్వామ్యన్ని ప్రతినిత్య ప్రజా స్వామ్యం అని కూడా వ్యవహరిస్తారు . ఇది మొట్ట మొదట ఇంగ్లాండ్ లో ఆవిర్భావించింది . అటు తర్వాత ఫ్రాన్స్, జర్మన్లు, ఇటలీ , భారత దేశం మొదలైన దేశాలకు విస్తరించిoది పరోక్ష లేదా ప్రతి నిద్య ప్రజాస్వామ్య లక్షణాలు:-
      ఓటు అధికరాం గల ప్రజలంతా అత్యంత సార్వబౌమాదికరం కలిగినవారు . ఈ విధంగా ప్రభుత్వ విధానంలో రాజకీయ పార్టిలు  మధ్య వర్తిత పాత్ర ను  వహిస్తాయి. ప్రతి నిద్య ప్రజా స్వామ్య వ్యవస్థ ను పని చేసేటట్లు చేస్తాయి .
గుణాలు :-
1) సామాన్య ప్రజల ప్రయోజనాలకు రక్షణ:-
     ఇతర రకాలైన ప్రభుత్వాల్లో ప్రత్యేక వర్గ ప్రయోజనాలు మాత్రమే కాపాడటo జరుగుతుంది. కానీ ప్రజా స్వామ్య విధానంలో సామాన్య ప్రజలప్రయోజనాలకు రక్షణ లభిస్తుంది.
 2) సమానత్వ నికి ప్రాధాన్యత :-
    ప్రజాస్వామ్యంలో ప్రజలoదరు సమానులే. పౌరుల మధ్య ఏ విధ మైన విచక్షణ పాటించడం జరుగుతుంది. మతం , లింగం , జాతి , తెగ , భాష ,ప్రాంతం మొదలైన వివక్ష చట్ట రిత్యా నిషేదించడం జరుగుతుంది .
3 ) ఆదర్శపూరితమైన ప్రభుత్వం ;-
       మానవ జాతికి అత్యంత  ఆవశ్యకతను స్వేఛ్చా, సమానత్వం , సౌబ్రత్రుత్వం , లోకితత్వం , సమైఖ్య  భావన, సమానత్వం మొదలైన ఉన్నతదర్శాలు ప్రజా స్వామ్యంలో  ఆధారణ  పొందుతాయి . సాటి ప్రపంచ రాజ్యాలలో శాంతియుతంగాసహా జీవన విధానన్ని అవలంబించే ప్రయత్నం జరుగుతుంది. పరస్పరo ఎ వేన సమస్యలు ఎదురే నేరుగా యుద్దానికి దిగక సంప్రదింపులు , చర్చల ద్వారా ఇచ్చిపుచ్చుకొనే దోరణిలో పరిష్కరించుకోవాలన్న ఆకాంక్ష ఉంటుంది .
     కానీ ఇతర ప్రభుత్వ రూపాలో ఇలాంటి ఆదర్శా లకు తావులేదు. నీతి , అవినీతి లెక్క చేయడం జరగదు . మానవతా విలువలు పక్కకు తోస్తారు . అది కేవలం  రాజ్య విస్తరణ కాంక్ష తో కయ్యానికి కాలు దువ్వూనికి ఉంటాయి .
దోషాలు :-
1) అసమర్థుల పాలన :-
    హెన్ర్ మైన్ అభిప్రాయoలో అనుభవం వల్ల తెలిసిన వస్తావే మంటే , ప్రజాస్వామ్య ప్రభుత్వలు  చాలా చవక బారు ప్రభుత్వలు , వాటి మూలంగా ఇతర ప్రభుత్వ రూపాలకు భద్రత లేకుండా పోయింది . స్వేఛ్చాకు , సమానత్వానికి అసలు పొంతన లేదు . అ కారణoగా దాని బలహినత ఇనుమదించి ప్రభావ వర్గాల ప్రాబల్యం పెరుగు తుంది .
2) ప్రజాస్వామ్యంలో నాగరికతా సంస్కృతులకు హాని :-
ప్రొఫ్ . హెన్రీ మైన్ ప్రజాస్వామ్యం వల్ల నాగరికతా, సంస్కృతుల వికాసానికి హాని కలుగుతుందిని అభిప్రాయ పడ్డాడు
3 ) ప్రజాస్వామ్యo లో గుణం కంటే సంఖ్య కే ప్రాభల్యం :-
       ప్రజా స్వామ్యం లో మెజారిటీ ఓట్లను బట్టి నిర్ణయాలు జరుగుతాయి . ఒక విద్యవంతుని ఓటుకు నిరక్షరాస్యుని  ఓటుకు విలువలో తేడా ఉండదు . ఈ విధంగా సంఖ్య ప్రాభల్యంలో గుణం నిర్లక్ష్యనికి గురై , అవివేక నిర్ణయాలు చట్టాలు అమలు జరిగే ప్రమాదం ఉంటుంది.
4) పరిపాలన మోయ లేనంత భారం:-
    ప్రజాస్వామ్యoలో ఎన్నికల ఖర్చు విపరీతo గా ఉంటుంది . శాసన సభుల నిర్మాణo , నిర్వహణ కూడా ఖర్చుతో ఉంటుంది . అధికారం చేతులు మారినపుడు పరిపాలనలో జరిగే కొత్త కొత్త ప్రయోగాలూ , మార్పులు చేర్పులు కూడా దేశం ఆర్థిక పరిస్తితిని మార్చేస్తాయి.
ముగింపు:- ప్రపంచoలో అన్ని విధాల నిర్దిష్టమైన వ్యవస్థ ఏది లేదు, ప్రజాస్వామ్యలోని గుణ దోషాలను విశ్లేషణ చేన్తే  గుణాలే ఎక్కువ .
23) ఏక కేంద్ర లక్షణాలు తెలిపి , గుణ దోషాలు వివరించండి  ?
జ ) ప్రభుత్వాలను అధికార కేంద్రం ప్రాతి పాదిక ఫై రెండు రకాలగా పేర్కొన వచ్చు . ఒకటి ఏక కేంద్ర o , రెండవది సమాఖ్య ప్రభుత్వం , ఏక కేంద్రo గల ప్రభుత్వం అని నష్టమవుతుంది . ఆంగ్ల బాష కూడా “uni” అంటే  “ ఒకటి” , “tari” అనగా “అధికారం” అని అర్థం , unitary అంటే ఒక్క అధికార కేంద్రం గల ప్రభుత్వం అని అర్థం .
ముఖ్య లక్షణాలు:-
1) ఒకే ఒక అధికార కేంద్రం ;-
     ఏక కేంద్ర ప్రభుత్వంలో ఒకే ఒక అధికారo కేంద్రంలో ఉంటుంది. సర్వాధికారాలుదానికే చెందుతాయి . ఒక రాజధాని నగర కేంద్రంగా దాని అధికారాలు రాజ్య మంతటా చేలామణి అవుతాయి .
2) పరిపాలనా క్షేత్రాలు గా ఉండ వచ్చ, ఉండక పోవచ్చు:-
    పరిపాలన సౌలభ్యం దృశ్య కేంద్రం కొన్ని పరిపాలన క్షేత్రాలను జిల్లా లు , తాలుకాలు , మండలాలు మొదలైన వాటిని సృష్టి o చావచ్చు .
3) పరిపాలనా క్షేత్రాలు కేంద్రీకరణ మై ఉండటం :-
    ఏక కేంద్ర ప్రభుత్వం లో పరిపాలన క్షేత్రాలను స్వాయం ప్రతి పత్తి  ఉండదు . అవి ఏర్పాటు కావడం గానీ , కొనసాగడం గానీ అంతా కేంద్ర ప్రభుత్వం ఫై ఆధార పడి ఉంటుంది . అవి తమకు కేంద్రం దత్తం చేసిన విషయాలలో మాత్రమే భాద్యతలను నిర్వరిస్తాయి .
4) లిఖిత లేదా అలిఖిత  రాజ్యాంగం :-
     ఏక కేంద్ర ప్రభుత్వ నికి లిఖిత రూపంలో రాజ్యాంగం ఉండ వచ్చు, ఉండ పోవచ్చు ఒకే ఒక్క కేంద్ర ప్రభుత్వo అన్ని అధికారాలను చెలాయిస్తుoది.
5) కేంద్ర శాసన సభ ఆధిక్యత :-
    ఏకకేంద్ర ప్రభుత్వ  విధానంలో శాసన సభ ఒక్కటి మాత్రమే ఉంటుంది అది సర్వోన్నత సంస్థగా వ్యవహరిస్తుంది .
గుణ దోషాల పరిశేలన :-
1 ) సమర్ధవంత మైన పాలన:-
      ఏక కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన చాలా సమర్ధవంతంగా ఉండే అవకాశం ఉంది . దేశం మొత్తం ఒకే పాలన వ్యవస్థలో ఉండటం వల్ల పాలనా సమైక్యత , చట్ట సమైక్యత ఒకదానికొకటి తోడే పాలనా సామర్ద్యాన్ని ఇనుమడింపజేస్తుంది.
2 ) సరళమైన విధానం – మార్పు లకు అనుకూలo :-
ఏక కేంద్ర ప్రభుత్వ విధానం చాల సరళ మైంది .దేశ కాల పరిస్థితులను బట్టి దీనిలో మార్పులు తేవడం చాలా సులభం .
3) రాజ్యాంగ చట్ట పరమైన సంఘర్షణ ఉండవు :-
     ఈ పద్దతిలో ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి గల రాష్ట్ర ప్రభుత్వలు ఉండవు . రాజ్యాంగ చట్ట పరంగా అధికార విభజిన ఉండదు . కాబటి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వ ల మధ్య వివాదాలకు గానీ , సంఘర్షణలకు గానీ తావులేదు.
4) త్వరిత నిర్ణయాలు:-
     దేశ ప్రయోజనాలు దృష్ట్యా ఏవై న నిర్ణయాలు తీయ వలసి వస్తే కేంద్ర ప్రభుత్వం స్వయంగా తెసుకుంటుంది , నిర్ణయాలు తెసుకోవడం లో జాప్యం ఉండదు.
5) ఖర్చు తక్కవ :-
ఒకే ఒక పాలనా వ్యవస్థ కింద మొత్తం దేశం ఉండదు కాబట్టి  వ్యవస్థ నిర్వహణపరంగా ఖర్చు తక్కువ.
దోషాలు:-
1)  అధికార కేంద్రీకరణ- నిరంకుశ పాలన :-
     సర్వాధికారాలు ఒకే ఒక కేంద్రంలో కేంద్రీకృత మై ఉండటం వల్ల పాలకులు అధికార మత్తులు కావడానికి అవకాశాలు అధికంగా ఉంటాయి . ప్రొఫ్. లస్కి చెప్పినట్లు అధికారలు వికేంద్రికృతమై అవి నియత్రుత్వం అవుతాయి .
2) ప్రజలకు భాగస్వావ్యం తక్కువ:-
     ఏక కేంద్ర పద్దతి లో ప్రభుత్వంగాలు ఒక్కొకటే  కాబట్టి అధికారాలు కేంద్రికృతoగా ఉంటాయి . ఈ కారణంగా ప్రజలకు ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా తక్కువ భాగస్వామ్యం లభిస్తుంది .
3 )  ప్రజల చొరవ నశిస్తుంది :-
     ఏక కేంద్ర విధానంలో పరిపాలన క్షేత్రాలు పాలన సౌలబ్యం నిమిత్తంగా ఏర్పాటవుతాయి . అయితే వాటికీ స్వతంత్ర ప్రతి పత్తి ఉండదు .
4) స్థానిక  సమస్యల నిర్లక్ష్యం:-
     ఏక కేంద్ర ప్రభుత్వ పద్దతిలో సుదూర ప్రాంతాల సమస్యలు నిర్లక్ష్యనికి గురవుతాయి . స్థానిక సమస్యల తీరు తెన్నెలూ , స్వభావము ఎక్కడో మారన ఉండే కేంద్ర ప్రభుత్వానికి సంభందo కాలేవు .
24) సమాఖ్య లక్షణాలు తెలిపి , గుణ దోషాలను వివరింపుము ?
జ ) పరిచయం :-
     రాజ్యాంగ బద్ధంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల పంపిణి ఉన్నట్లుఅయితే అటువంటి ప్రభుత్వ విధానాన్ని సమాఖ్య ప్రభుత్వం అని పిలుస్తారు . వాస్తవం పరిశేలిస్తే ఫెడరల్ (federal) అనే ఆంగ్ల పదానికి ఫోడస్ (fodus) అనే లాటిన్ పదం మూలం ఫోడాస్ అంటే ఒడంబడిక (Agreement) లేదా ఒప్పందం ( Treaty) అని అర్థం .
నిర్వచనాలు:-
సమాఖ్యను కొందరు ప్రముఖులు  ఈ క్రింది విధంగా నిర్వచించారు .
1) “ జాతీయ సమైక్య తను , రాష్ట్రాల హక్కులను సమన్వయ పరచే రాజకీయ సాధనమే సమాఖ్య”-ఎ .వి . డైసి
2) ‘ స్వతంత్ర రాష్ట్రాల కలయిక ఫలితంగా ఏర్పడిన నూతన రాజ్య స్వరూపమే సమాఖ్య రాజ్యం “
లక్షణాలు:-
1)  రాజ్యాంగ ఆధిక్యత – లిఖత రాజ్యాంగం ;-
      సమాఖ్యలో రాజ్యాంగమే అతున్నత మైన శాసనం . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిర్మాణానికి అధికారాలకు రాజ్యంగ ప్రాతి పదిక , సభ్య రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందాల ద్వార సమాఖ్య ఏర్పడుతుంది .
2) అధికార విభజిన :-
     రాజ్యాంగం చట్ట బద్దంగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను విభజిస్తుంది . జాతీయ ప్రాముఖ్యం గల అంశాలు ముఖ్యంగా దేశ రక్షణ ,ఆర్థిక వ్యవహారాలు, విదేశాంగ వ్యవహారాల, తంతి తపాలా , రైల్వేలు,పౌరత్వం మొ || విషయాలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి .
3) రెండు స్థాయిలో ప్రభుత్వాలు :-
    సమాఖ్య వ్యవస్థ లో రెండు స్థాయిలో ప్రభుత్వాలు ఉంటాయి.ఒకటి కేంద్ర స్థాయి, రెండోది రాష్ట్ర ల స్థాయి
4) దృఢ రాజ్యాంగం :-
  సమాఖ్య ప్రభుత్వoలో రాజ్యంగo లిఖిత రూపంలో ఉండటంతో పాటు దృఢ రాజ్యాంగ లక్షణాలు కలిగి ఉంటుంది. సాధారణo గా సమాఖ్య రాజ్యాల్లో రాజ్యాంగాన్ని సులభంగా మార్చడానికి వీలుండదు .
5) స్వతంత్ర న్యాయశాఖ :-
     సమాఖ్యవ్యవస్థ లో రెండు ప్రభుత్వాలు ఉండటం వల్ల వాటి మధ్య కొన్ని సందర్భల్లో వివాదాలు ఉత్పన్న o కావటానికి అవకాశముంది .
ప్రయోజనాలు:-
1) భిన్నత్వంలో ఏకత్వo :-
     ప్రో .కే .సి .వేర్ అభిప్రాయ o లో సమాఖ్య వ్యవస్థ ద్వారా భిన్నత్వం లో ఏకత్వo సధిoచవచ్చు . జాతీయ సమైఖ్యత , ప్రాంతీయ స్వేఛ్చాలను సమాఖ్య ప్రభుత్వం సమన్వయము చేస్తుంది .
2) నిరంకుశత్వాన్ని నిరోధిస్తుంది :-
     రాజ్యాంగానికి లోబడి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార పరిధిలో పాలనను నిర్వహిస్తాయి కబట్ట అవి నియంతృత్వ ధోరణిలో ప్రవర్తించడానికి అవకాశాలు ఉండవు .
3 ) కేంద్ర ప్రభుత్వ భారం తగ్గుతుంది :-
     కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికార విభజన వల్ల పాలన భాద్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తాయి .ప్రాంతీయ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వాలు  పరిష్కరించడం వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన విషయాలఫై దృష్టిని కేంద్రీకరించడానికి విలువుంటుంది
4 ) కొత్త ప్రయోగాలకు అవకాశం:-
       ఈ పద్దతిలో ఆర్థిక , రాజకీయ, పాలన రంగాల్లో నూతన ప్రయోగాలూ చేపట్టడానికి అవకాశం ఎక్కువ . వివిధ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు అనుకూలంగా ప్రత్యేక శ్రద్ధతో , ఆర్థిక , సాంఘిక రంగాల్లో అభివృద్దిని సాధించవచ్చు . పొతే కేంద్ర ప్రభుత్వం ఇరకాటంలో పడ్డుతుంది .
4) బలహినమైన ప్రభుత్వం :-
ప్రో .ఏ .వి .డై సి అభిప్రాయo లో సమాఖ్య ప్రభుత్వ పద్దతిలో రెండు ప్రభుత్వాలు అసంతులిత మైన అధికార పరిధిలో పని చేయవలసి రావటంతో వాటి మధ్య సామరస్యం లోపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .
5) అభివృద్ధికి దృఢ  రాజ్యాంగం అవరోధం :-
    సమాఖ్య రాజ్యాలకు దృఢ రాజ్యంగాలు ఉంటాయి . ఆ రాజ్యంగాలను సవరించాలంటే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం కావాలి . కొన్ని సందర్భల్లో రాజ్యంగాలను సవరించాలంటే కేంద్ర , రాష్ట్ర  ప్రభుత్వాల అంగికరించకపోవచ్చు.
25 ) పార్లమెంటరీ తరహ ప్రభుత్వ లక్షణాలు, గుణ దోషాలు తెల్పండి ?
జ ) పరిచయం;-
   పార్లమెంటరీ ప్రభూత్వo లో కార్యనిర్వాహక వర్గం శాసన నిర్మాణ శాఖ చే ఏర్పాటు కాదు , అధ్యక్ష తరహ ప్రభుత్వం ఈ రెండు శాఖల అధకార వేర్పాటు ఫై ఆధారపడి ఉంది . అధ్యక్షతరహ ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ , శాసన నిర్మాణ శాఖకు భాద్యత వహించాడు .
ముఖ్య లక్షణాలు :-
1) నామమాత్ర, వాస్తవ కార్యనిర్వాహక శాఖ :-
పార్లమెంటరీ ప్రభుత్వంలో కార్యనిర్వాహక శాఖ ను రెండు రకాలుగావర్గీకరించవచ్చు. అవి
1.    నామమాత్ర కార్యనిర్వాహక శాఖ
2.    వాస్తవ కార్యనిర్వాహక శాఖ
2 .మంత్రులు శాసన సభలో సభ్యులు :-
ప్రధాన మంత్రితో పాటు మంత్రి మండలి లోని పార్లమెంటులో సభ్యులే ఉండాలి .
3 . పార్లమెంట్కు సమిష్టి , వ్యక్తి గత భాద్యతలు :-
      రాజ్య కార్యకలాపాలను నిర్వహించే మంత్రి మండలి రాజకీయ నిర్ణయాలకు , చర్యలకి, ప్రభుత్వ పాలన విజయాలకు , వై ఫల్యలకు సమిష్టిగా పార్లమెంట్ భాద్యత వహిస్తుంది. భారత దేశ రాజ్యాంగం ద్వారా మంత్రి మండలి సమిష్టిగా పార్లమెంట్ కు భాద్యత వహిస్తుందని ప్రకటించింది .
ప్రయోజనాలు:-
1) శాసన నిర్మాణ , కార్యనిర్వాహక శాఖల మధ్య సహకారం సమన్వయo :-
    పార్లమెంటరీ ప్రభుత్వంలో ఉంటాయి మంత్రులందరు , పార్లమెంట్oలో సభ్యులు కావడం ములాన అ సభ్యుల ప్రజాభిప్రాయం ప్రకారం మంత్రులు చట్టాలను రూపొందిస్తారు . అలాగే మంత్రులు చట్టలను ఆమోదిస్తారు . కాబట్టి  ఈ రెండు శాఖల మధ్య వివాదాలకు , సంఘర్షణలకు సాధారణo గా అవకాశం ఉండదు.
2 ) ప్రతి పక్షం ప్రయోజనాల రక్షణకు భాద్యత వహిస్తుంది :
     పార్లమెంటరీ ప్రభుత్వంలో ప్రతి పక్షం ప్రభుత్వన్నినిర్మాణాత్మక పద్దతిలో హేతుబద్ధo గా నిర్వహిస్తుంది ప్రభుత్వ సామర్ధ్యాన్ని ఇనుమడింప చేయడంలో తోడ్పడుతుంది. బ్రిటన్ లో ప్రతి పక్ష పార్టి నాయకులూ ప్రత్యామ్నయ ప్రధాన మంత్రిగా గుర్తింపు పొందుతాడు .
3) అధికార వికేంద్రి కరణ – ప్రభుత్వ నియంతృత్వ నికి అవకాశం తక్కువ :-
      పార్లమెంటరీ ప్రభుత్వంలో అధికార వికేంద్రికరణ ప్రోత్సాహo చ బడుతుంది . ఈ విధానంలో కార్యనిర్వాహణ అధికారం ఏ ఒక్కరి చేతులో కేంద్రీకృతం కాదు . మంత్రి మండలి ప్రత్యక్షo గా పార్లమెంట్ కు , పరోక్షంగా ప్రజలకు బాద్యత వహిస్తుంది . ప్రశ్నలు, తీర్మానాలు, ప్రవేశం  పెట్టడం పార్లమెంటు మంత్రి వర్గాన్ని అదుపులో ఉంచుతుంది .
4 ) రాజకీయ పార్టిలు ప్రజా సంక్షేమ లక్ష్యం తో పని చేసే అవకాశం ఉంది :-
      పార్లమెంటురి విధానంలో రాజకీయ పార్టీల ప్రాబల్యం అధికం గా ఉంటుంది . అధికార పార్టి పార్లమెంటులో తనకు అత్యదిక మెజారిటీ ఉందన్న ధిమాతో ప్రజాభిప్రాయనన్ని గమనించ కుండా ఇష్టా రాజ్యం చేసినట్లు  ప్రతి పక్ష పార్టీల మూలంగా ఆందోళనలు , ప్రదర్శనలు , బంద్ లు మొ || లై జరిగి ప్రజల దృష్టిలో పార్టి ప్రతి ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంటుంది .
5) ప్రత్యామ్నయ ప్రభుత్వ ఏర్పాటు సులభం :-
      రాజకీయ విప్లవాలను అవకాశం ఉంటుంది ప్రభుత్వంలో ఎటువంటి మార్పు ల నా సులభంగా ప్రవేశ పెట్ట వచ్చు. మంత్రి వర్గాన్ని అవిశ్వాస తిర్మానం ద్వారా తొలగించండి తర్వాత ప్రతిపక్షాలు ప్రత్యామ్నయ ప్రభుత్వన్ని ఏర్పాటు చేయటానికి సంసిద్ధత చూపుతాయి.
లోపాలు :-
1 ) పార్లమెంటు విశ్వాసం పొందాలని నియమం ప్రభుత్వం ఇరకాటంలో పడేస్తుంది  ప్రభుత్వాని అది ముందు దిగజారుస్తుంది . పార్లమెంటులో అధికార పార్టీకి చెక్కు  చెదరని మెజారిటీ ఉంటే బాగుంటుంది.
2 ) అధికార పార్టికి పార్లమెంటులో మెజారిటీ లేకుంటే మరో ప్రమాదo కూడా ఉంది , ఆ పార్టికి అధికారాన్ని నిలబెట్టు కోవాలన తాపత్రయం ఎక్కువవుతుంది . ఆ కారణం గా అది నీతి నియమాలకు దారి తెసి పార్టి ఫిరాయింపులను ప్రోతహిస్తాo ది .
3) అధికారాన్ని నిలబెట్టు కోవాలని తాపత్రయం తో అధికార పార్టీ సొంత పార్టీ ప్రయోజనాలకు ప్రాముఖ్యత నిచ్చి జాతీయ ప్రయోజనాలకు తక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది .
4) పార్లమెంటరీ పద్దతి పాలన రెండు పార్టీల పద్దతిలో విజయ వంతమైన బహుళ పార్టీ వ్యవస్థ లో కాలేక పోయాయి . బహుళ పార్టి వ్యవస్థ మూలంగా అనేక అనర్ధాలు జరిగి , ప్రజాస్వామ్యనికే ముప్పు ఏర్పడి అవి చాలా వరకు సైనిక శాసనo పాల్పడ్డాయి .
5 ) ప్రతి పక్ష పార్టిలు నిర్మాణాత్మకo గా తమ కర్తవ్యన్ని నిర్వహించవు. ప్రభుత్వం ప్రతి చర్య చూపుడు వేలు సందిస్తాయి . ప్రభుత్వం ప్రజా సంక్షేమ దృష్టితో ఎన్ని మంచి పనులు చేస్తున్న ప్రశంసించకపోగాఅడ్డు కునే ప్రయత్నం చేస్తాయి .
26) అధ్యక్షతరహ  ప్రభుత్వం – లక్షణాలు ?
పరిచయం:-
       ఏ ప్రభుత్వ విధానంలో కార్యనిర్వాహక శాఖ , శాసన నిర్మాణ శాఖ తో సంభందం ఉండకపోవడమే గాక , తన పదవి కాలం నిమిత్తం దాని పై ఆధార పదేదో , తన విధానాల విషయంలో దానికీ జవాబు దారీ కూడా ఉండదో అని అధ్యక్ష ప్రభుత్వ విధానమని ప్రఫెస్సోర్ గర్నేర్ పేర్కొన్నాడు ఆమెరికా దేశంలోని రాజ్యాధినేత మైన అధ్యక్షణి ఈ వర్గంలో చేర్చవచ్చు .
ముఖ్య లక్షణాలు :-
అధ్యక్షుడు వాస్తవా కార్యనిర్వాహక అధికారి :-
అధ్యక్ష ప్రభుత్వ పద్దతిలో అధ్యక్షుడే వాస్తవ కార్యనిర్వాహక అధికారాలు వేరు వేరుగా ఉండవు .
ఏక సభ్య కార్యనిర్వాహక అధికారం:-
అధ్యక్ష ప్రభుత్వంలో కార్య నిర్వాహక అధికారాలను ఒకే వ్యక్తీ నిర్వహిస్తాడు .
నిరోధ సమతౌల్యం:-
అధ్యక్ష ప్రభుత్వంలో నిరోధ సమతౌల్యం (checks and balance ) ఒక ప్రముఖ లక్షణం . దీని ద్వారా ప్రభుత్వం లో మూడు అంగాలు – శాసన శాఖ , కార్య నిర్వాహక శాఖ , న్యాయ శాఖ నియంతృత్వన్ని చెలాయించడానికి అవకాశం చాల తక్కువ .
శాసన సభ ను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేయడం ;-
శాసన నిర్మాణ , కార్యనిర్వాహక శాఖల అధికారం వేర్పాటు ఆధారంగా ఏర్పడిందే అధ్యక్ష ప్రభుత్వం లో శాసన సభ , కార్యనిర్వాహక శాఖ రెండు స్వతంత్రo గా వ్యవహరిస్తాయి .
ప్రయోజనాలు:-
1 ) కార్య నిర్వహనాధికారి యైన అధ్యక్షుడు ఒక నిర్ణీత కాలం ఎన్నిక వుతాడు . అతని పదవి కాలం శాసన సభ ఇష్టాఇష్టాల ఫై ఆధార పడి ఉండదు . అందు వల్ల పదవి కాలం ముగి సే o త వరకు అతడు పదవిలో కొనసాగుతాడు, అధ్యక్షుడు శాసన సభ అనుమతి గాని , కార్యదర్శుల సలహాను గాని పాటించే అవసరం లేదు .
2) అధ్యక్షుడు పాలన శాఖద్యక్షుడు గా , సలహాదారునిగా అనుభావుజ్ఞులను , సమర్ధులను నియమించి పాలన సాగిస్తాడు . అధ్యక్షుని సలహాదారులకు శాసన సంభందం ఉండదు , వారు ఏ నియజక వర్గానికి ప్రతినిత్యం వహించారు .
3) కార్యనిర్వాహక అధికారం అంతా ఒకే వ్యక్తీ చేతిలో కేంద్రీకృత మై ఉండటం వల్ల ఆ వ్యక్తి నిర్ణయాలను త్వరగా  చేయగలదు . ప్రజా సమస్యల పరిష్కారానికి అతడు  శాసన సభను గాని , తన మంత్రులను గాని సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవడంలో గాని , వాటిని అమలు పరచడంలో గాని ఎటువంటి ఆలస్యం జరగదు .
4 ) అధ్యక్ష ప్రభుత్వ విధానంలో ప్రభుత్వంగాలు విడివిడిగా స్వతంత్రంగా ఉంటాయి .పరస్పర నియంత్రణ ఉంటుంది  .ప్రతి  ప్రభుత్వంగం తనకు ఇచ్చిన అధికారా లానే నిర్వహించి ఇతర శాఖల వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు .
లోపాలు :-
1) అని వార్గల వారికి అన్ని ప్రాంతాల వారికి ప్రభుత్వ పాలనలో తగినంత ప్రాతినిధ్యం లభించదు . అధ్యక్షడు తనకు ఇష్టం మున్న వారిని సలహాదారునిగా, ప్రభుత్వ ధికారులు గాను నియమించి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది .
2 ) దురదృష్టవశాత్తూ ఒక అసమర్థుడైన అధ్యక్షడు ఎన్నికైన దేశం అతణ్ణి  గడువు ముగిసే వరకు భరించి ,ఆమెరికా లో దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధులు అద్యక్షు ని ఫై మహాభియోగ తీర్మానం ద్వార అతని పదవి చ్యుతున్ని చేయ గలడు. కానీ మహాభియోగ తీర్మానన్ని రాజ్యాంగ చట్టబద్దంగా అమోదదించ వలసి ఉంటుంది .
3) అధ్యక్షుడు భాద్యతారహితంగా దేశాన్ని పాలించే అవకాశం ఉంది .అతడు శాసన సభకు భాద్యత రహితతంగా ప్రతి పక్ష పార్టీ విమర్శలను పట్టించుకోడు . కొని సందర్భలో దేశం అతను చెప్పినట్లు నడవ వలసిన అవసరం ఏర్పడ వొచ్చు .
4) అధ్యక్ష ప్రభుత్వ విదానాo  ఉన్న చోట సాధారణo గా రాజ్యాంగం ఉంటుంది, అందు వల్ల రాజ్యాంగంలో కొని అంశాలను సులబంగా  మార్చడానికి సాధ్య పడదు , మారుతున్న పరిస్తితులకు అనుగుణంగా పాలన సగించడం కష్టమవుతుంది .
5) ఆమెరికాలో అధ్యక్షునికి చాల అధికారాలు ఉన్నపడికి అతడు వ్యక్తి స్వతంత్ర నికి ఆటంకం గా ఉండలేదు , అతడు కొన్ని అధికారాలు కొందరికి దత్తం చేయవలసి వస్తుంది .
27) శాసన సభ విధులు పేర్కొనండి ?
జ ) పరిచయం:-
      ఆధునిక శాసన సభలు అనేక విధులను నేరవేరుస్తున్నాయి , ప్రపంచ దేశాలో ప్రభుత్వ స్వరూపాన్ని  బట్టి శాసన సభలు అనేక విధులు , భాద్యతలు కలిగి ఉన్నాయి . పార్లమెంటురీ తరహ ఆధునిక శాసన సభలు అనేక విధులను  నేరవేరుస్తున్నాయి.
1) చట్టాలను రూపొందించడం:-
     శాసన సభలు చట్టాలను రూపొందించే విధిని నిర్వహిస్తాయి . శాసన  సభలో ప్రవేశ పెట్టిన బిల్లులను చర్చించి,సవరణలతోలేదాసవరణలులేకుండా రాజ్యాంగానికి అనుగుణంగా ఆమోదించిబడుతుంది.ప్రజాస్వామ్య రాజ్యలో శాసన సభలో సాదారణంగా బిల్లు లను మూడు రీడింగ్ లో   ఆమోదిస్తారు .
2 ) సభాకార్యక్రమాల నిర్వహణ అధికారుల ఎన్నిక తొలగింపు :-
శాసన సభ లో కార్యక్రమాలను నిర్వహించడానికి సభ్యులు కొంతమంది అధికారులను ఎన్నుకుంటారు. ఉదా:- సభాపతి (speaker), ఉప సభాధిపతి (Deputy speaker) మొదలగువారు . ఈ విధంగా సభాసభ్యుల చేత ఎనుకో బడిన అధికారులను దుర్వినియోగం  చేస్తే వారిని అవిశ్వాస తీర్మానాo ద్వారా తొలిగించే  అధికారం శాసన సభ్యుల్లకి కలిగి ఉంటారు.
3) శాసన సభ్యుల ఆర్థిక విధులు :-
అన్ని రాకలైన  విధులలో ఆర్థిక విధులు ప్రాముఖ్యత కలిగి ఉన్నయి  శాసన సభల ఆమోదం లేనిదే ప్రభుత్వ నికి ఖర్చు పెట్ట డానికి వీలు లేదు . ప్రభుత్వం పన్ను విధింపు విషయంలో లేదా పన్నులను రద్దు పరిచే విషయంలో ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో శాసన సభల అమోదన్ని తప్పనిసరిగా పొందాలి .
4 ) దేశాధిపతిల ఎన్నిక పదవీ చ్చుతులను చేసే భాద్యత :-
     దేశాధిపతుల ఎన్నికొనే భాద్యత శాసన సభలపై ఉంటుంది. వారసత్వ సూత్రాలకు అనుగుణంగా లేదా  ఎన్నిక పద్దతులను  అనుగుణంగా రాజ్యధిపతులను ఎన్నుకొనే  భాద్యత శాసన సభల పై ఉంటుంది . వారసత్వ సూత్రాలకు అనుగుణంగా లేదా ఎన్నిక పద్ధతులకు అనుగుణంగా రాజ్యదిపతులకు ఎన్నికొనే భాద్యత శాసన సభలపై ఉంటుంది.
5 ) రాజ్యాంగ పరమైన విధులు ;-
   రాజ్యoగాలను సవరించే పద్దతిలో శాసన సభ్యులు ప్రముఖ పాత్రను నిరవహిస్తాయి . అదృడ రాజ్యాంగం కలిగిన దేశాల్లో రాజ్యాంగ సవరణ పద్దతులు సామాన్య చట్ట నిర్మాణ విధానాన్ని పోలి ఉంటుంది .
6) మంత్రి మండలి  పై విశ్వాసాన్ని ప్రకటించడం :-
      ఈ తరహ ప్రభుత్వ పద్దతిలో ప్రధానమైన మంత్రి మండలి శాసన సభుల విశ్వాసం కోల్పోయిన ప్రధాన మంత్రి , మంత్రి మండలి పై విశ్వాసం కోల్పోయినట్లు రాజ్యాధినేత ప్రకటించి అటువంటి ప్రధాన మంత్రి అతని సహచరులైన ఇతర మంత్రులను పదవిచ్యుతులను చేస్తాడు .
28 ) కార్యనిర్వాహక శాఖ విధులు తెలిపి , రకాలు తెల్పండి ?
జ ) పరిచయం:-
      కార్యనిర్వాహక శాఖ అంటే రాజ్యాధిపతులు , వారి మంత్రులు , సలహాదారులు , పరిపాలన శాఖాధిపతులు మాత్రమే చట్టాలను రూపొందించి , అటువంటి చట్టాలను అమలు పరచడమే కార్యనిర్వాహక శాఖ ప్రధాన భాద్యత.
కార్యనిర్వాహక శాఖ – రకాలు :-
1.    వాస్తవ కార్యనిర్వాహక వర్గం , నామమాత్ర  కార్యనిర్వాహక వర్గం
2.    పార్లమెంటరీ  కార్యనిర్వాహక వర్గం , అధ్యక్ష కార్యనిర్వాహక వర్గం
3.    ఏకసభ్య కార్యనిర్వాహక వర్గం , బహు సభ్య కార్యనిర్వాహక వర్గం
4.    శాశ్వత కార్యనిర్వాహక శాఖ , రాజకీయ కార్యనిర్వాహక శాఖ .
విధులు :-
1 ) దేశంలో శాంతి భద్రతలను కాపాడే విధి :-
   దేశంలో చట్టాలను అమలు పరిచి శాంతి భద్రతలను కాపాడే భాద్యత కార్యనిర్వాహక శాఖ పై ఉంటుంది . భాద్యతల నిర్వహణ లో మంత్రి మండలి సభ్యులు తమ శాఖల సక్రమ నిర్వహణ ను భాద్యతలు నిర్వహిస్తారు
) దేశ సార్వభౌమాధికారాన్ని సంరక్షించే భాద్యత:-
     దేశ స్వాతంత్ర్యానికి , సార్వభౌమాధికారాన్నికి ప్రమాదం కలిగి నప్పుడు దేశాన్ని విదేశే దురాక్రమణo నుంచి రక్షించడానికి కొసం అవసరమైన నిర్ణయాలు తెసుకొని అమలు చేసే భాద్యత కార్యనిర్వాహక శాఖ పై ఉంది .
3) ఆర్థిక విధులు :-
       దేశానికి సంభందించిన ఆర్థిక విషయంలో కార్యనిర్వాహక శాఖ ముఖ్య మైన పాత్రను నిర్వహిస్తునది . ప్రభుత్వ ఆదాయ , వ్యయాలకు సంభందించిన బడ్జెట్ ను రూపొందించడం కార్యనిర్వాహక శాఖ కు ముఖ్యమైన విధి .
4 ) చట్ట సంభంద మైన విధులు :-
    దేశ పాలనకు , దేశ అభివృద్ధిని దృష్టి లో ఉంచుకొని కార్యనిర్వాహక వర్గం  చట్ట నిర్మాణ సమయంలో చొరవ చూపుతుంది . ముసాయిద చట్ట్లను రూపొందించి వాటిని శాసన సభలో ప్రవేశ పెట్టి ఆమోదించేటట్ల చస్తుoది.
5 ) పాలన సంభందమైన విధులు :-
      రాజ్యానికి సంబంధించిన మొత్తం పరిపాలన కార్యనిర్వాహక వర్గం పేరిట జరుగుతుంది. ప్రభుత్వ శాఖలలో ఉన్నత ఉద్యోగుల ను నియమించడం , వారి విధులను కేటాయించడం . విధి నిర్వహణకు అవసరమైన శిక్షణలు వారికి ఇవ్వడం మొదలగు విధులను కార్యనిర్వాహక శాఖ నిర్వహిస్తుంది .
6 ) సంక్షేమ విధులు :-
     ఆధునిక కాలంలో సంక్షేమ విధులను నిర్వహించే భాద్యతలు కార్యనిర్వాహక శాఖ పై ఉంటుంది ప్రణాళిక బద్దంగా  దేశం సంపూర్ణo గా అభివృద్ధి సాధించే దిశలో కార్యనిర్వాహక శాఖ కృషి చేస్తుoది .
29) న్యాయ శాఖ విధులను గురించి తెల్పండి ?
జ ) ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యంలో రాజ్యాంగ విలువలను , ప్రజాస్వామ్య సూత్రాలను , ప్రజ హక్కులను పరిరక్షించడంలో  న్యాయశాఖ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది . ఆధునిక సమాజంలో పౌరుల హక్కులకు రక్షణ కల్పించే న్యాయ శాఖ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుంది. ఆధునిక సమాజంలో పౌరుల హక్కులకు రక్షణ కల్పించే న్యాయశాఖ రాజ్యాంగ శాసన పరిధిలోప్రభుత్వాన్ని పనిచేసేటట్లు చూస్తుంది .
న్యాయ శాఖ విధులు :-
    ఆధునిక రాజకీయ వ్యవస్థలో న్యాయశాఖ కు ప్రాధాన్యత ఇవ్వబడింది . న్యాయ విలువలను , రాజ్యాంగాన్ని పరిరక్షించే క్రమం లో న్యాయ శాఖ అనేక విధులను నిర్వర్తిస్తుంది . న్యాయశాఖ ప్రధాన విధుల ను ఈ దిగువ వివరించబడింది .
రాజ్యాంగ రక్షణ- న్యాయసమిక్ష :-
    ప్రజాస్వామ్య దేశాల్లో న్యాయశాఖ రాజ్యాంగాన్ని పరిరక్షించే భాద్యతలను కలిగి ఉంటుంది. శాసన సభలు , కార్యనిర్వాహక వర్గం రాజ్యాంగానికి వ్యతిరేఖంగా విధులను నిర్వహిస్తే అటువంటి చర్యలు రాజ్యాంగ విరుద్ధమైనదని న్యాయశాఖ ప్రకటిస్తుంది .
న్యాయస్థాన నిర్ణయాలు చట్టాలకు మూలాధారం:-
      న్యాయశాఖ నిర్ణయాలు చట్టాల్ని జస్టిస్ హోమ్స్ అనే ఆమెరికన్ న్యాయవాది పేర్కొన్నాడు.చట్టం అభివృద్ధిపై న్యాయమూర్తుల నిర్ణయాలకు  ప్రభావం ఎక్కువగా ఉంటాయి .
సలహ పూర్వక విధులు :-
      న్యాయశాఖ కు కొన్ని సలహా పూర్వక విదులున్నాయి. చట్ట విషయంలో లేదా ప్రజా ప్రాముఖ్యత ఉన్న విషయాల ఫై న్యాయశాఖ అభిప్రాయాన్ని లేదా సలహ తెలపాలని రాజ్యాధినేత కోరిన పక్షంలో న్యాయశాఖ తన అభిప్రాయాన్ని లేదా సలహ ను ఇస్తుంది.
వివాదాలపరిష్కరణ , పౌరుల హక్కులకు రక్షణ:-
       ప్రజల మధ్య తలెత్తి వివాదాలను , ప్రభుత్వనికి మధ్య తలెత్తే వివాదాలను ప్రభుత్వ్లను మధ్య తలెత్తే వివాదాలను పరిశీలించి పరిష్కరించే భాద్యత న్యాయ శాఖ ఉంటుంది . నేరాలను విచారించి నేరస్తులకు శిక్ష విధిస్తుంది .
చట్టాలకు అర్థ వివరణ ఇచ్చే భాద్యత:-
     చట్టాలకు అర్థ వివరణ ఇవ్వడం న్యాయశాఖ ల ముఖ్య విధి , ఎవరికీ వారె చెప్తే అర్థాల మూలంగా కేసులు పరిష్కరిమపబడవు .
కోర్ట్ అఫ్ రికార్డ్ :-
      న్యాయ స్థానాలు కోర్ట్ అఫ్ రికర్ద్గా వ్యవహరిస్తాయి, న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను , న్యాయ వ్యవహారాలకు సంభందించిన సమాచారాలను రికార్డ్ రుపంలో భద్ర పరుస్తాయి . ఇటువంటి రికార్డ్ లు న్యాయమూర్తులకు కేసుల పరిష్కారంలో మార్గదర్శికొంగాను , నమునగాను ఉపయోగపడతాయి .
౩౦ ) న్యాయసమిక్ష విధులు తెల్పండి ?
) పరిచయం :-
       ప్రజాస్వామ్య దేశాలో శాసన సభలు చేసే చట్టాను సమిక్షించడమే న్యాయ సమిక్ష శాసన చేసే చట్టలు రాజ్యాంగానికి విరుద్దాo గా ఉంటే వాటిని చెల్లా వని  నిరోధించడం లేదా రద్దు చేసే అధికారం న్యాయ స్థానాలకుంది  దినేనే న్యాయ సమిక్ష అధికారం అంటారు .
      ఒక చట్టాన్ని కానీ , ప్రభుత్వ చర్యలు గాని రాజ్యాంగ చట్టాలకు విరుద్దాo గా ఉంటే వాటిని వాటిని చెల్లా వని  నిరోధించడం లేదా రద్దు చేసే అధికారం న్యాయ స్థానాలకుంది  దినేనే న్యాయ సమిక్ష అధికారం అని “ఆమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్” అనే గ్రంధంలో ప్రొఫెసర్ ఫెర్గుసన్ మెక్ హెన్రీ పేర్కొన్నాడు.
న్యాయ సమిక్ష మూలాధారాలు :-
1.    రాజ్యాంగ చట్టాలకు ఔనత్వం కల్పించ బడలి , రాజ్యాంగం లిఖిత రూపంలో ఉండాలి .
2.    రాజ్యాంగం దృఢ లక్షణాలను కలిగి ఉండాలి .
3.    రాజ్యాంగంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన పొందు పరచాలి ,రాజ్యాంగంలో ని ప్రాధమిక హక్కులు శాసన సభల శాసన నిర్మాణ అధికారం ఫై పరిమితులు ఏర్పాటు చేయాలి .
ఆమెరికా దేశంలో న్యాయ సమిక్ష:-
       ఆమెరికా రాజ్యాంగంలోని న్యాయ సమిక్ష ను గురించి లేకపోయినప్పటికీ న్యాయసమీక్షను ఆమెరికా లో ప్రఫెసర్ ఫెర్గుసన్ , మెక్ హెన్రీ ల అభిప్రాయలంలో అమెరిక రాజ్యాంగం అమలుకు వచ్చిన తోలి రౌలో అ దేశంలోన్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ప్రకరణం లో నిగూఢo గా దగిందని ఈ అధికారన్ని గుర్తించింది. అమెరిన్ రాజ్యాంగంలోసెక్షన్ 2 , నిభందన VI న్యాయసమిక్ష అధికారం స్పష్టo గా పేర్కొన లేనప్పటికీ , పరోక్షంగా ఆ ఆశయాని నెరవేరుస్తుంది అని రాజ్యాంగ నిపుణులు వాదించరు . ఆలాగే అలెగ్జండర్ పేర్కొన్నాడు .
చారిత్రాత్మకమైన మర్బరి Vs మాడిసన్ వివాదం – న్యాయమూర్తి మార్షల్ తీర్పు :
పందొమ్మిదో శతాబ్దాo తోలి రోజుల్లో ఆమెరికా దేశంలో సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ మర్బురీ , మాడిసన్ వివాదంలో ఇచ్చిన తీర్పు న్యాయసమిక్ష కి మూలాధారం.
31) న్యాయశాఖ స్వత్రoత్ర ప్రతిపత్తి  గురించి వివరించడి ?
జ ) పరిచయం:-
     రాజకీయ వ్యవస్థలో న్యాయశాఖ ప్రాధాన్యత సంతరించుకుంది, మారుతున్న రాజకీయ, సాంఘిక , ఆర్థిక పరిస్థితులో  స్వత్రoత్ర ప్రతిపత్తి   కలిగిన న్యాయశాఖ అవసరం ఎంతయినా ఉన్నది . కార్యనిర్వాహక, శాసన నిర్మాణం న్యాయదికారాలు రాజరిక వ్యవస్థలో ఒకే వ్యక్తీ నిర్వహించే వాడు . కాబట్టి చాలా మంది రాజులూ నియంతల వలే వ్యవహరించేవారు వారు . అటువంటి వ్యవస్థ లో ప్రజాస్వామ్యనికి , న్యాయానికి విలువలు తగ్గిపోయే అవకాశాలు ఉండేవి .
ముఖ్యాంశాలు :-
1.    శాసన నిర్మాణ అధికారం , వాటిని అమలు పరిచే అధికారం నుంచి న్యాయశాఖ ను వేరు చేయకపోతే ప్రజలు స్వేచ్ఛను అనుభవించ లేరు .
2.    శాసన నిర్మాణ అధికారం నుంచి న్యాయధికరన్ని వేరు చేయకపోతే పోరుల జేవనం స్వేచ్ఛలు నిరంకుశ నియంత్రణకు గురవుతాయి .
3.    కార్యనిర్వాహక అధికారాలు నుంచి న్యాయధికారాల ను వేరు చేయకపోతే న్యాయాధికార ప్రవర్తన హింసాయుతంగా ఉంటుంది. పౌరులు అనేక రంగాలో స్వేచ్ఛను కోల్పోయి పీడనకు గురవుతారు .
 మానవ హక్కులు
మానవ హక్కులు   మానవులగా   జన్మించడం వారందరు ఈ  హక్కుకు  అర్హులు, కావున వీటిని  మానవ హక్కులు అని అంటారు . ఇవి  అందరూ  మానవులకు  శాశ్వత మరియు భంగం కాని  హక్కులు. వాటి వల్ల  మానవుల కు స్వాభావిక గౌరవం పుడతాయి. ఇవి  మానవ మనుగడ మరియు మానవ అభివృద్ధి కోసం అవసరం.
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన
మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన  డిక్లరేషన్ కు  అందరూ  మానవులు అర్హులు ఇది మానవ హక్కుల మొట్టమొదటి అంతర్జాతీయ వ్యక్తీకరణగా  సూచిస్తుంది 1948 లో UN జనరల్ అసెంబ్లీ ద్వారా స్వీకరించబడింది. ఇది 'ఇంటర్నేషనల్ మాగ్న కార్టా "గా వర్ణించబడింది.
ఈ ప్రకటన నాలుగు భాగాలుగా విభజించవచ్చు 30  ఆర్టికల్ తో  కూడినది .వీటిని  క్రింద వివరించబడ్డాయి. మొదటి రెండు ఆర్టికల్  మానవ హక్కుల అంతర్లీన ప్రాథమిక సూత్రాలు కలిగి ఉంది . వీటిని కింది విధంగా వివరించారు .
ఆర్టికల్ 1.
అందరూ  మానవులు స్వేఛ్చ గా పుట్టి మరియు గౌరవం  తో బ్రతకడానికి  సమాన హక్కు కలదు  
ఆర్టికల్ 2.
అందరూ అన్ని హక్కులను కలిగి  ఉంది మరియు స్వేచ్ఛలు జాతి, రంగు, లింగ , భాష, మతం, రాజకీయ లేదా ఇతర అభిప్రాయం, జాతీయ లేదా సామాజిక మూలం, ఆస్తి, పుట్టిన లేదా ఇతర స్థితి వంటి, రకమైన వ్యత్యాసం లేకుండా, ప్రకటనలో నిర్ధేశించిన. ఇంకా, వ్యత్యాసం అది స్వతంత్ర, ట్రస్ట్, కాని స్వీయ పాలన లేదా సార్వభౌమత్వాన్ని ఇతర పరిమితి కింద కావచ్చు, ఒక వ్యక్తికి చెందిన దేశం లేదా భూభాగం, రాజకీయ చట్టబద్దమైన లేదా అంతర్జాతీయ స్థితి ఆధారంగా తయారు నిర్ణయించబడతాయి
ఆర్టికల్ 3.
అందరూ వ్యక్తుల  జీవితం, స్వేచ్ఛ మరియు యొక్క భద్రతా హక్కు
ఆర్టికల్ 4.
ఎవరూ బానిసత్వం లేదా దాస్యం నుంచి స్వేఛ్చ , బానిసత్వం మరియు బానిసల వ్యాపారము వారి రూపాల్లో నిషేధించబడింది నిర్ణయించబడతాయి
ఆర్టికిల్ 5.
ఎవరూ చిత్రహింసలు లేదా క్రూరమైన, అమానుష లేదా అవమానకర చికిత్స లేదా శిక్ష లోబడి ఉండాలి.
ఆర్టికల్ 6.
అందరూ చట్టం ముందు ఒక వ్యక్తిగా  ప్రతిచోటా గుర్తింపు హక్కు.
ఆర్టికల్ 7.
అన్ని చట్టం ముందు సమానంగా ఉంటాయి మరియు చట్టం యొక్క సమాన రక్షణ వివక్ష లేకుండా అర్హులు. అన్ని డిక్లరేషన్ ఉల్లంఘించి మరియు అటువంటి వివక్ష పోషించడం వ్యతిరేకంగా వివక్షత సమాన రక్షణ అర్హులు
ఆర్టికల్ 8.
అందరూ రాజ్యాంగము లేదా చట్టం ద్వారా తనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించినట్లు చర్యలకు సమర్థ జాతీయ న్యాయస్థానాలు ద్వారా సమర్థవంతమైన పరిష్కారం హక్కు
ఆర్టికల్ 9.
ఎవరూ ఏకపక్ష అరెస్ట్, నిర్బంధ లేదా దేశ బహిష్కరణ లోబడి ఉండాలి.
ఆర్టికల్ 10.
అందరూ తన హక్కులు మరియు బాధ్యతలు నిర్ధారణలో మరియు అతనికి వ్యతిరేకంగా నేరారోపణ యొక్క, ఒక స్వతంత్ర నిష్పాక్షిక ట్రిబ్యునల్ ఒక సరసమైన మరియు ప్రజా విచారణను పూర్తి సమానత్వం పేరుతో ఉంది.
ఆర్టికల్ 11.
అతను తన రక్షణ కోసం అవసరమైన అన్ని హామీలు కలిగిన వద్ద ఒక బహిరంగ విచారణలో చట్టం ప్రకారం నేరస్తుడిగా చూపుతూ వరకు (1) శిక్షాస్మృతి నేరం మోపబడి అందరూ కుడి ఉంది నిర్దోషులుగా భావించాలని కు.
(2) ఎవరూ అది ఒప్పుకున్నాను సమయంలో, జాతీయ లేదా అంతర్జాతీయ చట్టం కింద, ఒక శిక్షాస్మృతి నేరం ఉన్నారు లేదు చట్టం లేదా పరిహరించడం ఖాతాలోని శిక్షా దోషి జరుగుతుంది. నార్ భారమైన పెనాల్టీ శిక్షా నేరం కట్టుబడి జరిగినది సమయంలో వర్తించే అని ఒకటి కంటే విధించిన నిర్ణయించబడతాయి.
ఆర్టికల్ 12.
ఎవరూ, లేదా అతని గౌరవార్ధం మరియు కీర్తి మీద దాడులతో అతని గోప్యతా, కుటుంబం, ఇంటి లేదా అనురూప్యం ఏకపక్ష జోక్యం లోబడి ఉండాలి. అందరూ అటువంటి జోక్యం లేదా దాడులను చట్టం రక్షణ హక్కు.
ఆర్టికల్ 13.
(1) అందరి ప్రతి దేశపు సరిహద్దుల లోపల చలనము మరియు నివాస స్వేచ్ఛ హక్కు ఉంది.
(2) అందరి దేశం విడిచి తన సొంత సహా, మరియు తన దేశానికి తిరిగి హక్కు.
ఆర్టికల్ 14.
(1) అందరి కోరుకుంటారు మరియు హింస నుండి ఇతర దేశాలకు ఆశ్రయం ఆస్వాదించడానికి హక్కు ఉంది.
(2) కుడి శుద్ధముగా కాని రాజకీయ నేరాలు నుండి లేదా యునైటెడ్ నేషన్స్ ప్రయోజనాల మరియు నియమాలకు విరుద్ధంగా చర్యల వలన కలిగే చట్టరీత్యా విషయంలో ఆవాహన ఉండకపోవచ్చు.
ఆర్టికల్ 15.
(1) అందరి జాతీయత హక్కు.
(2) ఎవరూ ఏకపక్ష అతని జాతీయతను కోల్పోయింది లేదా అతని జాతీయతను మార్చుకునే హక్కును ఖండించారు నిర్ణయించబడతాయి.
ఆర్టికల్ 16.
(1) కారణంగా జాతి, జాతీయత లేదా మతం పరిమితి లేకుండా మెన్ మరియు పూర్తి వయస్సు మహిళలు, వివాహం మరియు ఒక కుటుంబం దొరకలేదు హక్కు ఉంటుంది. వారు వివాహం సమయంలో మరియు దాని రద్దుకు వద్ద, వివాహం వంటి హక్కులు ఒకే అర్హులు.
(2) వివాహ ఉద్దేశించి జీవిత భాగస్వాముల ఉచిత మరియు పూర్తి సమ్మతితో మాత్రమే నమోదు చేయబడుతుంది కమిటీ.
(3) కుటుంబం సమాజం సహజ మరియు ప్రాథమిక గ్రూపు యూనిట్ మరియు సమాజం మరియు రాష్ట్రం ద్వారా రక్షణ పేరుతో ఉంది
ఆర్టికల్ 17.
(1) అందరి ఇతరులు సహకారంతో అలాగే ఒంటరిగా ఆస్తి సొంతం చేసుకునే హక్కు ఉంది.
(2) ఎవరూ ఏకపక్ష తన ఆస్తి కోల్పోతాడు.
ఆర్టికల్ 18.
అందరూ ఆలోచనను, మనస్సాక్షిని మరియు మత స్వేచ్ఛ హక్కు; కుడి బోధన, ఆచరణ, ఆరాధన మరియు పాటించాలని తన మతం లేదా నమ్మకాన్ని వ్యక్తం ఒంటరిగా లేదా ఇతరులతో కమ్యూనిటీలో మరియు పబ్లిక్ లేదా ప్రైవేట్ గాని, తన మతం లేదా నమ్మకం, మరియు స్వేచ్ఛ మార్చుకునే స్వేచ్ఛను కలిగి
ఆర్టికల్ 19.
అందరూ అభిప్రాయం మరియు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు ఉంది; కుడి, జోక్యం లేకుండా మరియు కోరుకుంటారు అభిప్రాయాలు నొక్కి అందుకుంటారు మరియు ఇచ్చు సమాచారం మరియు ఆలోచనలు మీడియా ద్వారా మరియు సంబంధం లేకుండా సరిహద్దులను స్వేచ్ఛ ఇచ్చింది.
ఆర్టికల్ 20.
(1) అందరి శాంతియుత అసెంబ్లీ మరియు అసోసియేషన్ స్వేచ్ఛ హక్కు.
(2) ఎవరూ ఒక సంఘం చెందిన ఒత్తిడి కావచ్చు.
ఆర్టికల్ 21.
(1) అందరి ప్రత్యక్షంగా లేదా ఉచితంగా ఎంపిక ప్రతినిధుల ద్వారా తన దేశానికి ప్రభుత్వం పాల్గొనడానికి హక్కు ఉంది.
(2) అందరూ తన దేశంలో ప్రజా సేవ సమానంగా యాక్సెస్ కుడి ఉంది.
(3) ప్రజల రెడీ ప్రభుత్వ అధికారం ఆధారంగా యుండును; యూనివర్సల్ మరియు సమాన ఓటుహక్కు ఉండాలి మరియు రహస్య ఓటు ద్వారా లేదా సమానమైన ఉచిత ఓటింగ్ విధానాలు నిర్వహించిన నిర్ణయించబడతాయి ఆవర్తన మరియు వాస్తవమైన ఎన్నికల్లో వ్యక్తం నిర్ణయించబడతాయి.
ఆర్టికల్ 22.
అందరూ సమాజంలో సభ్యుడిగా, సామాజిక భద్రతా హక్కు ఉంది మరియు జాతీయ ప్రయత్నం మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా మరియు ఆర్ధిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు అనివార్య యొక్క ప్రతి రాష్ట్రం యొక్క సంస్థ మరియు వనరులు, కోసం అనుగుణంగా, పరిపూర్ణత అనే పేరుతో ఉంది అతని పరువు మరియు అతని వ్యక్తిత్వం యొక్క స్వేచ్ఛాయుత అభివృద్ది
ఆర్టికల్ 23.
(1) అందరి పని కేవలం మరియు అనుకూలమైన పరిస్థితులు మరియు నిరుద్యోగానికి వ్యతిరేకంగా రక్షణకు, ఉపాధి ఉచిత ఎంపిక, పని హక్కు ఉంది.
(2) అందరూ వివక్ష లేకుండా, సమాన పనికి సమాన వేతనం హక్కు.
(3) పనిచేసే అందరూ కుడి ఉంది కేవలం మరియు అవసరమైతే అనుకూలమైన వేతనం సామాజిక రక్షణ ఇతర మార్గాల ద్వారా, తనకు తన కుటుంబానికి మానవ గౌరవం యోగ్యమైనది ఒక ఉనికి, మరియు అనుబంధంగా కోసం భరోసా.
(4) ప్రతి ఒక్కరూ రూపం మరియు తన ప్రయోజనాలు రక్షణ కార్మిక సంఘాలు చేరే హక్కు ఉంది.
ఆర్టికల్ 24.
అందరూ పనిగంటలు మరియు పే కాలక్రమ సెలవులు సహేతుకమైన పరిమితులతో విశ్రాంతి హక్కు మరియు విశ్రాంతి ఉంది.
ఆర్టికల్ 25.
(1) అందరి ఆరోగ్య మరియు తనను మరియు ఆహారం, దుస్తులు, గృహ మరియు వైద్య సంరక్షణ మరియు అవసరమైన సామాజిక సేవలు సహా తన కుటుంబం యొక్క శ్రేయస్సు కోసం తగినంత జీవన ప్రమాణానికి కుడి, మరియు సందర్భంలో భద్రతా హక్కు ఉంది నిరుద్యోగం, అనారోగ్యం, వైకల్యం, వైధవ్యం, వృద్ధాప్య లేదా తన నియంత్రణ దాటి పరిస్థితులలో జీవనోపాధి ఇతర లేకపోవడం.
(2) మాతృత్వం మరియు చిన్ననాటి ప్రత్యేక శ్రద్ధ మరియు సహాయం అర్హులు. అన్ని పిల్లలు, లేదా పెళ్లి నుండి జన్మించిన లేదో, అదే సామాజిక రక్షణ ఆనందించాలి.
ఆర్టికల్ 26.
(1) అందరి విద్యా హక్కు ఉంది. ఎడ్యుకేషన్ కనీసం ప్రాథమిక మరియు ప్రాథమిక దశల్లో, స్వతంత్రులై యుందురు. ప్రాధమిక  విద్య తప్పనిసరి యుండును. సాంకేతిక మరియు వృత్తిపరమైన విద్యలో సాధారణంగా అందనున్నాయి మరియు ఉన్నత విద్య మెరిట్ ఆధారంగా అన్ని సమానంగా అందుబాటులో ఉండును.
(2) ఎడ్యుకేషన్ మానవ వ్యక్తిత్వం యొక్క సంపూర్ణ అభివృద్ధికి మరియు మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛలను కోసం గౌరవం బలపరిచేటటువంటి దర్శకత్వం నిర్ణయించబడతాయి. అన్ని దేశాలు, జాతి లేదా మత సమూహాల్లో అవగాహన, సహనం మరియు స్నేహం ప్రోత్సహించడానికి కమిటీ, మరియు శాంతి నిర్వహణ కోసం ఐక్యరాజ్యసమితి యొక్క కార్యకలాపాలు మరింత కమిటీ.
(3) తల్లిదండ్రులు వారి పిల్లలకు తర్ఫీదునిస్తారు విద్య యొక్క రకమైన ఎంచుకోవడానికి ముందుగా హక్కు ఉంటుంది.
ఆర్టికల్ 27.
(1) అందరి కళలు ఆస్వాదించడానికి మరియు సాంకేతిక పురోగమన మరియు దాని ప్రయోజనాలు పంచుకునేందుకు, సమాజపు సాంస్కృతిక జీవితంలో పాల్గొనేందుకు స్వేచ్ఛగా హక్కు ఉంది.
(2) అందరూ ఆయన వ్రాశారు ఇది శాస్త్రీయ సాహిత్య లేదా ఆర్టిస్టిక్ ప్రొడక్షన్ ఫలితంగా నైతిక మరియు పదార్థ ప్రయోజనాలు రక్షణ హక్కు.
ఆర్టికల్ 28.
అందరూ హక్కులు మరియు ప్రకటనలో నిర్ధేశించిన స్వేచ్ఛలు పూర్తిగా గ్రహించవచ్చు దీనిలో ఒక సాంఘిక మరియు అంతర్జాతీయ ఆర్డర్ పేరుతో ఉంది.
ఆర్టికల్ 29.
(1) అందరూ అతని వ్యక్తిత్వం యొక్క ఉచిత మరియు పూర్తి అభివృద్ధి సాధ్యం ఒంటరిగా దీనిలో కమ్యూనిటీకి విధులు ఉన్నాయి.
(2) తన హక్కులు మరియు స్వేచ్ఛలు వ్యాయామంలో, ప్రతి ఒక్కరూ మాత్రమే కేవలం హక్కులు మరియు ఇతరులు స్వేచ్ఛలు కారణంగా గుర్తింపు మరియు గౌరవాన్ని రక్షించుటకు ప్రయోజనం కోసం మరియు నైతికత కేవలం అర్హతలను చట్టం ద్వారా నిర్ణయించబడతాయి వంటి పరిమితులకు లోబడి ఉండాలి శాంతి, భద్రతలకు ప్రజాస్వామ్య సమాజంలో సాధారణ సంక్షేమం.
(3) హక్కులు మరియు స్వేచ్ఛలు సందర్భంలో ఐక్యరాజ్యసమితి యొక్క ప్రయోజనాల మరియు నియమాలకు విరుద్ధంగా నిర్వహించిన ఉండవచ్చు.
ఆర్టికల్ 30.
డిక్లరేషన్ ఏదీ రాష్ట్రం, సమూహం లేదా వ్యక్తి కోసం సూచించే నిమగ్నం లేదా ఇక్కడ నిర్ధేశించిన హక్కులు మరియు స్వేచ్ఛలు నాశనం లక్ష్యంతో పనిని చేయడం హక్కు ధ్వనించింది అన్వయించి ఉండవచ్చు.
మానవ హక్కుల అంతర్జాతీయ బిల్లు:-
తరువాత కాలం లో , మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన రెండు ప్రత్యేక లిఖిత, అవి, పౌర మరియు రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒప్పందం  మరియు ఆర్ధిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ లిఖిత సమ్మతి విభజింపబడింది. మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన కలిగి మానవ హక్కులు మరియు స్వేచ్ఛలు మరింత అభివృద్ధి మరియు రెండు లిఖిత మీద విస్తరించారు. రెండు లిఖిత 1966 లో UN జనరల్ అసెంబ్లీ ద్వారా స్వీకరించబడింది మరియు 1976 లో అమల్లోకి వచ్చాయి.
  అంతర్జాతీయ పైన రెండు వివరణాత్మక లిఖిత, రెండు ఐచ్ఛిక ప్రోటోకాల్లు పాటు, పౌర మరియు రాజకీయ హక్కులపై లిఖిత సమ్మతికి కూడా UN జనరల్ అసెంబ్లీ అమలు చేశారు. రెండవ ఐచ్చిక నియమాలు బలహీనుల మానవ హక్కులు సభ్యదేశం అతిక్రమించే వ్యక్తులు 1989 మొదటి ఐచ్చిక నియమాలు ఫిర్యాదులు ఇవ్వవలసిన అందిస్తుంది అనుసరించబడింది అయితే మొదటి ఐచ్చిక నియమాలు 1966 లో కూడా అనుసరించబడింది. రెండవ ప్రోటోకాల్, మరోవైపు, మరణం శిక్ష  రద్దుచేయడం వాదిస్తుంది.
 మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, పౌర మరియు రాజకీయ హక్కులు మరియు దాని రెండు ఐచ్ఛిక ప్రోటోకాల్లు, మరియు ఆర్ధిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ లిఖిత అంతర్జాతీయ లిఖిత ఇప్పుడు విస్తృతంగా 'మానవ హక్కుల అంతర్జాతీయ బిల్లులో' గా భావించబడుతుంది ఏర్పాటు చేస్తుంది.
ఇతర అంతర్జాతీయ సమావేశాల
మానవ హక్కుల అంతర్జాతీయ బిల్లులో మరింత వివిధ ఇతర అంతర్జాతీయ గ్రంథములు, సమావేశాలు మరియు ప్రకటనలు చేత అనుబంధం కలిగి ఉంది. వారు సాధారణంగా 'మానవ హక్కులు సాధనాల' గా అభివర్ణించవచ్చు. ప్రకృతిని నైపుణ్యం మరియు గాని ఒక ప్రత్యేక మానవ హక్కుల లేదా ఒక నిర్దిష్ట హాని సమూహం సంబంధించిన. క్రింది విధంగా వాటిలో ముఖ్యమైనవి:
1.    వర్ణ , వివక్ష అన్ని రకాల నిర్మూలనపై సదస్సు (1966)
2.    మహిళలపై వివక్ష అన్ని రకాల నిర్మూలనపై  సదస్సు (1979)
3.    హింస మరియు ఇతర క్రూరమైన, అమానుష లేదా అవమానకర చికిత్స లేదా శిక్షకు వ్యతిరేకంగా సదస్సు (1984)
4.    అభివృద్ధి హక్కుల  డిక్లరేషన్ (1986)
5.    బాలల హక్కులపై  సదస్సు (1989)
6.    అన్ని వలస కార్మికులు మరియు వారి కుటుంబ సభ్యుల హక్కుల పరిరక్షణపై సదస్సు (1990)
7.    వికలాంగులు హక్కుల  సదస్సు (2006)
భారతదేశం లో మానవ హక్కుల
భారతదేశం యొక్క రాజ్యాంగంలో  మానవ హక్కుల  గురించి గొప్ప విషయాలు ఉన్నాయి. ప్రవేశిక, ప్రాథమిక హక్కులు మరియు ప్రభుత్వ విధానంగా ఆదేశక సూత్రాలు సూత్రాలు మరియు నిబంధనలు మానవ హక్కులు (1948) సార్వత్రిక ప్రకటన ప్రతిబింబిస్తాయి.
పీఠిక యొక్క నాలుగు ఆదర్శాలు మానవ హక్కుల ప్రచారం లక్ష్యంగా చేసుకున్నాయి. వారు ప్రాంతాల్లో కింద:
1.    సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాల్లో న్యాయం
2.    ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం మరియు ప్రర్తన లో స్వేఛ్చ  
3.    స్థితి మరియు అవకాశం లో  సమానత్వం
4.    వ్యక్తిగత గౌరవానికి వచ్చేసి సౌబ్రత్రుత్వం .
రాజ్యాంగం భాగం-III కింద ప్రాథమిక హక్కులను ఆరు విభాగాలుగా విభజించబడింది పౌర మరియు రాజకీయ హక్కుల ఒక విస్తృతమైన జాబితా కలిగి:
1.    సమానత్వపు హక్కు
2.    స్వేచ్ఛ హక్కు
3.    పిడనానికి  వ్యతిరేకహక్కు
4.    మత స్వేచ్ఛ హక్కు
5.     సాంస్కృతిక మరియు విద్యా విషయపు హక్కు
6.     రాజ్యాంగ పరిహారపు హక్కు
రాజ్యాంగం భాగం-IV రాష్ట్ర విధానం ఆదేశిక సూత్రాల ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులు వివరీస్తాయి. వీటిని మూడు రకాలుగా  వర్గీకరించవచ్చు;
1. సామ్యవాద సూత్రాలు
2. గాంధీ వాద సూత్రాలు
3. స్వేఛ్చ – మేధో వాద  సూత్రాలు
 పార్ట్-III చేర్చబడిన ప్రాథమిక హక్కులను పాటు, , రాజ్యాంగం లోని  ఇతర భాగాలో   కొన్ని ఇతర హక్కులు ఉన్నాయి,  ఉదాహరణకు , రాజ్యాంగాన్ని లో భాగంగా-XII ఆస్తి హక్కు
 ఈ మధ్య కాలం లో , సుప్రీం కోర్టు  కూడా ప్రాథమిక హక్కులను కలిగి మానవ హక్కుల పరిధిని విస్తరించారు. ఇది వారు ప్రత్యేకంగా రాజ్యాంగం భాగం III లో పేర్కొంటున్నారు లేదు ఉన్నప్పటికీ ప్రాథమిక హక్కులను అంతర్భాగం, మానవ హక్కులని ప్రకటించింది. ఇటువంటి లెక్కించబడిన ప్రాథమిక హక్కులను ఉదాహరణలు కుడివైపు అందువలన ఉచిత న్యాయ సహాయ మరియు విదేశాలలో ప్రయాణంగోప్యతా హక్కు, హింస వ్యతిరేకంగావేగవంతమైన విచారణ హక్కు ,ఆరోగ్య హక్కు ఉన్నాయి.
హక్కుల రాజ్యాంగం హామీ ఇచ్చిన లేదా భారతదేశం లో న్యాయస్థానాలు అంతర్జాతీయ ఒప్పందం చొప్పించబడింది మరియు అమలు వ్యక్తిగత జీవితం, స్వేచ్ఛ, సమానత్వం మరియు గౌరవానికి సంబంధించిన చివరగా, మానవ హక్కుల చట్టాన్ని (1993) రక్షణ భారతదేశం లో మానవ హక్కులను ఇలా నిర్వచిస్తుంది. ఇంకా, అది కూడా పౌర మరియు రాజకీయ హక్కులపై అంతర్జాతీయ లిఖిత మరియు సాధారణ  సభ స్వీకరించింది 16 డిసెంబర్, 1996 మరియు అటువంటి ఇతర లిఖిత లేదా సమావేశాలు యునైటెడ్ నేషన్స్  జనరల్ అసెంబ్లీ ద్వారా స్వీకరించబడింది, ఆర్ధిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ లిఖిత నిర్వచించిన కేంద్ర ప్రభుత్వం, ఐక్యరాజ్యసమితి ప్రకటనలను పేర్కొన్నవారు ఉండవచ్చు. భారత ప్రభుత్వం ఏప్రిల్ 10, 1979 రెండు అంతర్జాతీయ లిఖిత అంగీకరించినప్పటికీ.
 భారతదేశం యొక్క రాజ్యాంగం మరియు పార్లమెంట్ అలాగే రాష్ట్ర అసెంబ్లీ చట్టాలు మాత్రమే అనేక మానవ హక్కుల కలిగి కానీ హక్కులు వల్ల  జాతీయ మరియు రాష్ట్ర కమిషన్లు స్థాపన కోసం అందించడానికి కృషి చేస్తుంది వాటిని ఈ  పట్టిక 1.1 మరియు 1.2 క్రింది పేర్కొనబడిన
కింద 1
వ .క్ర
 కమిషన్ యొక్క  పేరు
ఏర్పాటు  
01
నేషనల్ కమిషన్  షెడ్యూల్ కులాల
రాజ్యాంగం (వ్యాసం 338)
02
 నేషనల్ కమిషన్
రాజ్యాంగం (ఆర్టికల్ 338-A)
03
భాషాపరమైన మైనారిటీలకు ప్రత్యేక అధికారి
రాజ్యాంగం  (ఆర్టికల్ 350-B)
04
 జాతీయ మానవ హక్కుల కమిషన్
మానవ హక్కుల చట్టం యొక్క రక్షణ, 1993
05
కమిషన్లు రక్షణ కోసం  నేషనల్ కమిషన్
2005 బాలల హక్కుల చట్టం రక్షణ కోసం బాలల హక్కుల
06
నేషనల్ కమిషన్ మహిళలకు
ది నేషన్ కమిషన్ మహిళలకు, 1990
07
నేషనల్ కమిషన్ మైనార్టీలకు మైనారిటీలు
 నేషనల్ కమిషన్, 1992 చట్టం
08
ది వెనుకబడిన తరగతులకు నేషనల్ కమిషన్
నేషనల్ కమిషన్ వెనుకబడిన తరగతుల, 1993 చట్టం
09
 సెంట్రల్ కమిషనర్ వికలాంగులు  కొసం
వికలాంగుల చట్టం వ్యక్తులు, 1995

మానవ హక్కులకు టేబుల్ 1-.2 రాష్ట్ర కమీషన్లు
.క్ర
కమిషన్ పేరు
కింద ఏర్పాటు
1.
రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లు-
మానవ హక్కుల చట్టం యొక్క రక్షణ,   1993
 2.
రాష్ట్ర కమిషన్   బాలల హక్కుల  రక్షణ కోసం
కమిషన్లు  బాలల హక్కుల  రక్షణ చట్టం - 2005
3.
రాష్ట్ర కమిషనర్ వికలాంగులు -
వికలాంగుల చట్టం వ్యక్తులు, 1995
4.
రాష్ట్ర కమిషన్ SC మరియు ST యొక్క -
రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక స్పష్టత యొక్క చట్టం
5 .
మహిళలకు రాష్ట్ర కమిషన్
 రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక స్పష్టత యొక్క చట్టం
6.
రాష్ట్ర కమిషన్


రాష్ట్ర శాసనసభ అల్పసంఖ్యాకుల- చట్టం లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక స్పష్టత కోసం
7.

నేషనల్ కమిషన్ వెనుకబడిన తరగతులకు -

రాష్ట్ర శాసనసభ లేదా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక స్పష్టత
యొక్క    చట్టం






















     


No comments:

Post a Comment